డ్రగ్స్, గంజాయి విషయంలో టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు.. ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి.. వివిధ పత్రికల్లో వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. అందరికీ నోటీసులు ఇవ్వాలంటూ.. నోరు జారిన పట్టాభి.. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న దద్దమ్మకు చెబుతున్నా.. వరే బోసిడీకే నీకు దమ్ముంటే.. గంజాయిపై మాట్లాడిన తెలంగాణ పోలీసులకు, యూపీ పోలీసులకు, మీ అధికారులకు నోటీసులు ఇవ్వాలంటూ సవాల్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు.. పట్టాభి ఇంటిపై దాడికి దిగారు.. అంతే కాకుండా ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరగగా.. మరికొన్ని చోట్లు కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది.. అయితే, ఈ వ్యహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫోన్ చేశారు.. పట్టాభి ఇంటిపై దాడి, విధ్వంసం.. టీడీపీ ప్రధాన ఆఫీస్పై దాడి.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను ఆయ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు.. కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడారు చంద్రబాబు.. ఏపీలో పరిణామాలు, టీడీపీ కార్యాలయాలపై దాడుల విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. కేంద్ర బలగాలను పంపాలని కోరారు.