Chandrababu Naidu: నేను చేసి చూపిస్తా.. సీఎం జగన్కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu Challenges On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంపై మరోసారి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికి, ఇప్పుడు కేంద్రం పేరు చెప్పి జగన్ చేతులెత్తేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వడం లేదన్నారు. ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం చేతకాకపోతే, జగన్ రాజీనామా చేయాలన్నారు. పోలవరం ఎందుకు పూర్తి కాదో తాను చూస్తానన్నారు. పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే.. వైసీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు.
మూడేళ్లలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం.. ముంపు బాధితులకు రూ. 20 వేల కోట్లు ఇవ్వలేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ముందు పోలవరం బాధితులకు రూ. 10 ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేశారన్నారు. ముంపు వల్ల వేలాది కుటుంబాలు నష్టపోయాయని, జగన్ సర్కార్ బాధితుల బతుకులను గోదావరిలో ముంచుతోందని మండిపడ్డారు. జగన్ రోడ్డు మార్గాన వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోకుండా, హెలికాప్టర్లలో వచ్చి వెళ్లారన్నారు. ఎన్నికలకు ముద్దులు పెట్టిన జగన్.. ఇప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నారన్నారు. మాయమాలు చెప్పిన అధికారంలోకి వచ్చిన సీఎంకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు.
Also Read
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
- Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
- Amaravati Farmers: అమరావతి రైతుల హక్కులను పరిరక్షిస్తాం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కలెక్టర్లకు సీఎం 100 మార్కులేస్తారేమో గానీ, ప్రజలు మాత్రం సీఎంకి వేసిది సున్నా మార్కులని చంద్రబాబు చెప్పారు. కాగా.. రెండు రోజుల ముంపు ప్రాంతాల పర్యటనను చంద్రబాబు పూర్తి చేసుకున్నారు. వి.ఆర్. పురం రేఖపల్లిలోని వరద బాధిత ప్రాంతంలో బాధితులను ఓదార్చి, తన పర్యటనని ముగించుకున్నారు. భద్రాచలం మీదుగా గన్నవరం ఎయిర్ పోర్ట్కు బయలుదేరారు.
తాజావార్తలు
-
TV Ad Cap: 12 నిమిషాల యాడ్ రూల్కు కేంద్రం గుడ్బై.. టీవీ ఛానళ్లకు కొత్త నిబంధనలు
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
-
Sreeleela: ముంబైలో సెట్స్పై శ్రీలీల.. కార్తీక్ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్!
-
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!