Punganur Cow:పుంగనూరు జాతి ఆవుకి అరుదైన గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎక్కువే. అందులోనూ గోమాతకు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఇంట్లోనే ఆవుల్ని పెంచుకుంటాం. మన చుట్టూ తిరిగే ఆవు దూడలు మన పిల్లలతో సమానంగా పెంచుతాం. ఆవు ఇంట్లో తిరిగితే అది ఎంతో శుభదాయకం అంటారు. ఒక ఆవు జాతి వల్ల ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామం. పుంగనూరు ఆవుకు అనేక ప్రత్యేతలు ఉండడంతో ఎక్కువమంది ఈ ఆవుని పెంచుకోవడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. పుంగనూరు ఆవుకి మరింత గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల పోస్టల్ శాఖ‘ పుంగనూరు జాతి ఆవు’ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేయడంతో ఆ గ్రామం , ఆవు జాతి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- TDP Leadership Training Conclave: టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం.. నేటి నుంచే వర్క్షాప్
- NTR Bharosa Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇలా..
పుంగనూరు పొట్టి జాతి ఆవులతో మరో గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే 70–90 సెం.మీ ఎత్తు అంటే సుమారు రెండు అడుగుల ఎత్తు వుండి 115 నుంచి 200 కిలోల బరువు ఉండే ఆవులు పుంగనూరు ఆవులు. లేత బూడిద, తెలుపు రంగులో విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు కలిగి ఉంటాయి. ఇవి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తాయి. సాధార ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. దీంతో ఈ ఆవుపాలకు మంచి ధర లభిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఈ పాలు ఎంతో మంచివి.

తిరుమల తిరుపతి దేవస్థానాల గోశాలలో పుంగనూరు ఆవులను పెంచుతూ ఈ ఆవు పాల నుంచి వచ్చే నెయ్యిని శ్రీవారి అభిషేకానికి వాడుతుండడం మరో విశేషం. గతంలో ఆవుల్ని చాలాకొద్దిమంది మాత్రమే మేపేవారు. కానీ ఇప్పుడు పుంగనూరు తరహా ఆవుల్ని కొనాలంటే లక్షలు పెట్టాల్సిందే. దీంతో ఈ ఆవులు రైతుల పాలిట కామధేనువులుగా మారాయి. తెలుగురాష్ట్రాల్లో ఉన్న పుంగనూరు ఆవుల సంఖ్య కేవలం మూడువందలు మాత్రమే అంటే వీటికి ఎంత ప్రాముఖ్యత వుందో అర్థం చేసుకోవచ్చు. పుంగనూరు ఆవుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.

ఈ జాతి ఆవులు అంతరించి పోయే దశలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుంగనూరు జాతి ఆవుల మనుగడకు, పునరుత్పత్తికి రూ.63 కోట్ల వ్యయంతో ‘మిషన్ పుంగనూరు రీసెర్చ్ ప్రాజెక్టు’ అమలుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ రీసెర్చ్ ఆన్ లైవ్స్టాక్ లిమిటెడ్లో ఐవీఎఫ్ సాంకేతికతో పుంగనూరు జాతి పశువులను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నడుపుతోంది. పుంగనూరు ఆవు ఇంట్లో వుంటే అదో స్టేటస్ సింబల్. ఈ జాతి విశిష్గతను అందరికీ తెలియచేసేందుకు కేంద్రం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం పట్ల పుంగనూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Cancer: వాసనతో కుక్క క్యాన్సర్ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
-
MLAs Arrested: పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..!
-
PM Modi: పారిస్లో స్వామినారాయణ ఆలయాన్ని వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత్-ఫ్రాన్స్ బంధంపై కీలక వ్యాఖ్యలు
-
Telangana Assembly: అసెంబ్లీ గేటు దగ్గర గందరగోళం.. టీషర్ట్ విప్పి హరీష్ రావు ఆందోళన!
-
Special Trains: పండుగ సీజ్లో రైల్వేశాఖ గుడ్న్యూస్.. 20 ప్రత్యేక రైళ్లు.. 60 రోజుల ముందే టికెట్ బుకింగ్
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!