Punganur Cow:పుంగనూరు జాతి ఆవుకి అరుదైన గౌరవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు ఎక్కువే. అందులోనూ గోమాతకు మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. ఇంట్లోనే ఆవుల్ని పెంచుకుంటాం. మన చుట్టూ తిరిగే ఆవు దూడలు మన పిల్లలతో సమానంగా పెంచుతాం. ఆవు ఇంట్లో తిరిగితే అది ఎంతో శుభదాయకం అంటారు. ఒక ఆవు జాతి వల్ల ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అదే చిత్తూరు జిల్లా పుంగనూరు గ్రామం. పుంగనూరు ఆవుకు అనేక ప్రత్యేతలు ఉండడంతో ఎక్కువమంది ఈ ఆవుని పెంచుకోవడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. పుంగనూరు ఆవుకి మరింత గుర్తింపునిచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల పోస్టల్ శాఖ‘ పుంగనూరు జాతి ఆవు’ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేయడంతో ఆ గ్రామం , ఆవు జాతి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
పుంగనూరు పొట్టి జాతి ఆవులతో మరో గుర్తింపు వచ్చింది. ప్రపంచంలోనే 70–90 సెం.మీ ఎత్తు అంటే సుమారు రెండు అడుగుల ఎత్తు వుండి 115 నుంచి 200 కిలోల బరువు ఉండే ఆవులు పుంగనూరు ఆవులు. లేత బూడిద, తెలుపు రంగులో విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు కలిగి ఉంటాయి. ఇవి రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తాయి. సాధార ఆవుపాలలో ఔషధ విలువలతో పాటు 3 నుంచి 3.5 వరకు వెన్న శాతం ఉంటుంది. అదే పుంగనూరు ఆవు పాలలో 8 శాతం ఉంటుంది. దీంతో ఈ ఆవుపాలకు మంచి ధర లభిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఈ పాలు ఎంతో మంచివి.

తిరుమల తిరుపతి దేవస్థానాల గోశాలలో పుంగనూరు ఆవులను పెంచుతూ ఈ ఆవు పాల నుంచి వచ్చే నెయ్యిని శ్రీవారి అభిషేకానికి వాడుతుండడం మరో విశేషం. గతంలో ఆవుల్ని చాలాకొద్దిమంది మాత్రమే మేపేవారు. కానీ ఇప్పుడు పుంగనూరు తరహా ఆవుల్ని కొనాలంటే లక్షలు పెట్టాల్సిందే. దీంతో ఈ ఆవులు రైతుల పాలిట కామధేనువులుగా మారాయి. తెలుగురాష్ట్రాల్లో ఉన్న పుంగనూరు ఆవుల సంఖ్య కేవలం మూడువందలు మాత్రమే అంటే వీటికి ఎంత ప్రాముఖ్యత వుందో అర్థం చేసుకోవచ్చు. పుంగనూరు ఆవుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.

ఈ జాతి ఆవులు అంతరించి పోయే దశలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుంగనూరు జాతి ఆవుల మనుగడకు, పునరుత్పత్తికి రూ.63 కోట్ల వ్యయంతో ‘మిషన్ పుంగనూరు రీసెర్చ్ ప్రాజెక్టు’ అమలుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం సహకారంతో కడప జిల్లా పులివెందులలోని ఏపీ సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ రీసెర్చ్ ఆన్ లైవ్స్టాక్ లిమిటెడ్లో ఐవీఎఫ్ సాంకేతికతో పుంగనూరు జాతి పశువులను ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నడుపుతోంది. పుంగనూరు ఆవు ఇంట్లో వుంటే అదో స్టేటస్ సింబల్. ఈ జాతి విశిష్గతను అందరికీ తెలియచేసేందుకు కేంద్రం పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం పట్ల పుంగనూరు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!