Byreddy Siddhartha Reddy : చిన్న బాబు దెబ్బకి పెద్దబాబు బలి కాబోతున్నాడు
- కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ పై మోపిన అతిపెద్ద నింద లిక్కర్ స్కాం
- కూటమి వచ్చాక సొంత డిస్టలరీలు పెట్టి మద్యం తయారు చేస్తే తప్పు కాదు
- చిన్న బాబు దెబ్బకి పెద్దబాబు బలి కాబోతున్నాడు
- జనార్దన్ రావు కాల్ డేటా ఎందుకు తీయడం లేదు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్సీపీ సీనియర్ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయించలేకపోయాడని విమర్శించారు. “జగన్ ఏ మంచి కార్యక్రమం చేపట్టినా చంద్రబాబు ఒక్కరోజైనా అభినందించాడా? రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే తెలుగుకి అన్యాయం అంటాడు. మేము 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించుకున్నాం, కానీ అవన్నీ పూర్తయ్యే దశలో ఉన్నా కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోంది,” అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విమర్శించారు.
వైఎస్సార్సీపీ ఇమేజ్ను డామేజ్ చేయడం తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కూటమికి లేదని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. “85% పనులు పూర్తైన మెడికల్ కాలేజీలను చూపకుండా 15% మాత్రమే చూపించి ఏదో జరిగిపోయిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని తెలిపారు. “ఇప్పుడు తమకంటూ సొంత డిస్టిలరీలు పెట్టుకుని మద్యం తయారు చేస్తే తప్పు కాదని చెబుతున్నారు. తెలుగు దేశం నాయకులు గ్రామాల నుంచి మండలాల వరకు మద్యం సరఫరా చేసి దానిని ఆదాయ వనరుగా మార్చుకున్నారు,” అని మండిపడ్డారు.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
వరదలు వస్తే ప్రజలు బాధపడతారని, కానీ కూటమి నేతలు మాత్రం కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్కామ్ చేసే ఆలోచనతో సంతోషపడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఈ కూటమి ప్రభుత్వం గ్రాఫ్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పడిపోతుంది,” అని అన్నారు. “చిన్న బాబు దెబ్బకి పెద్ద బాబు బలి కాబోతున్నాడు,” అంటూ సిద్ధార్థ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే, “జనార్దన్ రావు కాల్ డేటా ఎందుకు తీయడం లేదు? తీస్తే తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్సీల గుట్టు బయటపడుతుంది. వారికి సంబంధం లేదని రుజువు చేస్తే మేము రాజకీయాలు వదులుకుంటాం,” అని సవాల్ విసిరారు. “అన్యాయంగా కేసుల్లో పెడితే ప్రజల్లో సింపతి వస్తుంది. ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవుతాడు.. జాక్పాట్ కొట్టినట్లే,” అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.
Murder : జగద్గిరిగుట్టలో రౌడీషీటర్పై దారుణ హత్య.. ఛేదించిన పోలీసులు
తాజావార్తలు
-
Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
-
CM Revanth Reddy : కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు.. సీఎం రేవంత్కు లేఖ.!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
-
Weight Loss Tablets: లావుగా ఉన్నవారికి గుడ్ న్యూస్.. వెయిట్ లాస్ డ్రగ్ అమ్మకాలు షూరు.. ఆ మ్యాజిక్ పిల్ కథేంటో చూడండి!
-
Head Coach: గౌతమ్ గంభీర్కు బిగ్ షాక్.. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశారు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!