Murder : జగద్గిరిగుట్టలో రౌడీషీటర్పై దారుణ హత్య.. ఛేదించిన పోలీసులు
- జగద్గిరిగుట్టలో రౌడీషీటర్పై దారుణ హత్య
- కత్తులతో నరికి చంపిన నిందితులు బులెట్పై పరార్
- ట్రాన్స్జెండర్పై అత్యాచార కేసు వివాదమే ఘర్షణకు కారణం
- ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25)ను మరో రౌడీషీటర్ బాలశౌ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బులెట్ బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. సుమారు 15 రోజుల క్రితం రోషన్ సింగ్, మరో ఆరుగురు మిత్రులు కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ ట్రాన్స్జెండర్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై బాధితుడు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
అయితే ట్రాన్స్జెండర్పై అత్యాచార కేసులో తాము చిక్కుకున్నామనే ఆగ్రహంతో రోషన్ సింగ్, తన స్నేహితుల మధ్య డబ్బు చెల్లింపుపై గొడవలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బాలశౌ రెడ్డి, ట్రాన్స్జెండర్ను కేసు పెట్టమని ఉసిగొల్పాడని రోషన్ సింగ్ అనుమానించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. చివరికి రోషన్ సింగ్ను హత్య చేయాలన్న ఉద్దేశంతో బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్లు బుధవారం జగద్గిరిగుట్ట బస్టాండు వద్దకు చేరుకున్నారు.
వీరిమధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా మహమ్మద్ వెనకనుంచి రోషన్ సింగ్ను పట్టుకోగా, బాలశౌ రెడ్డి కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన రోషన్ సింగ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు రోషన్ సింగ్, నిందితులు బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్లపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ముగ్గురినీ రిమాండుకు తరలించినట్లు మేడ్చల్ ఇన్చార్జ్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.
YS Jagan: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ..!
తాజావార్తలు
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!