Murder : జగద్గిరిగుట్టలో రౌడీషీటర్పై దారుణ హత్య.. ఛేదించిన పోలీసులు
- జగద్గిరిగుట్టలో రౌడీషీటర్పై దారుణ హత్య
- కత్తులతో నరికి చంపిన నిందితులు బులెట్పై పరార్
- ట్రాన్స్జెండర్పై అత్యాచార కేసు వివాదమే ఘర్షణకు కారణం
- ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్టలో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రౌడీ షీటర్ రోషన్ సింగ్ (25)ను మరో రౌడీషీటర్ బాలశౌ రెడ్డి, అతని అనుచరులు ఆదిల్, మహమ్మద్లు కలిసి కత్తులతో దారుణంగా నరికి హత్య చేశారు. హత్య అనంతరం నిందితులు బులెట్ బైక్పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. సుమారు 15 రోజుల క్రితం రోషన్ సింగ్, మరో ఆరుగురు మిత్రులు కలిసి జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ ట్రాన్స్జెండర్ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనపై బాధితుడు బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.
Also Read
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
అయితే ట్రాన్స్జెండర్పై అత్యాచార కేసులో తాము చిక్కుకున్నామనే ఆగ్రహంతో రోషన్ సింగ్, తన స్నేహితుల మధ్య డబ్బు చెల్లింపుపై గొడవలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో బాలశౌ రెడ్డి, ట్రాన్స్జెండర్ను కేసు పెట్టమని ఉసిగొల్పాడని రోషన్ సింగ్ అనుమానించాడు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. చివరికి రోషన్ సింగ్ను హత్య చేయాలన్న ఉద్దేశంతో బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్లు బుధవారం జగద్గిరిగుట్ట బస్టాండు వద్దకు చేరుకున్నారు.
వీరిమధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా మహమ్మద్ వెనకనుంచి రోషన్ సింగ్ను పట్టుకోగా, బాలశౌ రెడ్డి కత్తితో దారుణంగా పొడిచాడు. అనంతరం ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన రోషన్ సింగ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు రోషన్ సింగ్, నిందితులు బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్లపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ముగ్గురినీ రిమాండుకు తరలించినట్లు మేడ్చల్ ఇన్చార్జ్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.
YS Jagan: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు.. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ..!
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!