Byreddy Siddharth Reddy: సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్, పాలిటిక్స్లో సినిమా డైలాగ్స్.. అందుకే రెండు ఎత్తిపోయాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byreddy Siddharth Reddy Strong Political Punches On Pawan Kalyan Over AP Volunteers Issues: వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాశంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఎన్ని పర్యటనలు చేస్తున్నా.. తనని పట్టించుకునే వారు లేకపోవడంతో, పవన్ కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్ల రూ.5 వేల గౌరవ వేతనం తీసుకుని, ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్ల వల్ల డేటా చౌర్యం జరుగుతుందనటం సరికాదని హెచ్చరించారు. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన పనులను ఎవరూ ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఏపీలో కుళ్లిపోయిన పార్టీ టీడీపీ అని.. అలాంటి పార్టీతో పొత్తుకు పవన్ వెంపర్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. పవన్కు ఓటు వేయాలని ఏపీలో ఎవరూ అనుకోవడం లేదన్నారు.
Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
సినిమాల్లో పొలిటికల్ డైలాగులు, పాలిటిక్స్లో సినిమా డైలాగులు చెప్పుకుంటూ పవన్ తిరుగుతున్నారని.. అందుకే రెండూ ఎత్తిపోయాయని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందు.. లోకేష్ మంగళగిరి సంగతి చూడాలన్నారు. సీఎం జగన్ ఏపీలో పథకాలను ఎలా అమలు చేస్తున్నారో ప్రజలను అడగాలన్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టైనా ప్రారంభించి, పూర్తి చేసింది లేదని తూర్పారపట్టారు. పవన్, చంద్రబాబు, లోకేష్ ముగ్గురూ మూడువైపులా తిరుగుతూ.. విష ప్రచారాలు చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రతిఒక్కరూ త్యాగాలు చేసే రాజకీయాలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్ గురించి విమర్శించటం మానుకోవాలని హితవు పలికారు. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పాలే కానీ.. మీ అంతు చూస్తామంటూ మాట్లాడటం సరికాదన్నారు.
Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి
తాజావార్తలు
-
Amanpreet Singh Gill: విరాట్ కోహ్లీ సహచరుడు.. పంజాబ్ కింగ్స్ ఆటగాడు కన్నుమూత
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
-
SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!