Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Undavalli Arun Kumar Sensatioal Comments On Central And Ap State Governments

Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది

NTV Telugu Twitter
Published Date :July 30, 2023 , 1:31 pm
By NTV WebDesk
Undavalli Arun Kumar: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.. ఇంకా పునాదుల్లోనే ఉంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

Undavalli Arun Kumar Sensatioal Comments On Central And AP State Governments: పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని.. ఇంకా పునాదుల్లోనే ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తీర్మానం జరిగి ఇవాల్టికి పదేళ్లయిందని అన్నారు. ఉమ్మడి రాజధాని, పోలవరం నేషనల్ ప్రాజెక్టును తీర్మానంలో ప్రస్తావించి.. రాష్ట్ర విభజన చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాదు నుండి ఒక్క ఏడాదిలోనే బయటకు వచ్చామని చెప్పారు. దుగరాజపట్నం పోర్టు, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులు కనీసం ప్రారంభించలేదని మండిపడ్డారు. రైల్వే జోన్ ఇస్తామని చెప్పి, మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Daggubati Purandeswari: ‘మన్ కీ బాత్’ను రాజకీయాలకు ముడి పెట్టొద్దు.. పురందేశ్వరి విజ్ఞప్తి

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు ప్రభుత్వాలు మోడీకి అనుకూలంగా ఉన్నాయని ఉండవల్లి పేర్కొన్నారు. కేంద్ర ఏం చేసినా.. గట్టిగా ఎదుర్కొనే పరిస్థితిలో అధికార, ప్రతిపక్షాలు లేవని తేల్చి చెప్పారు. ఒక్క శాతం ఓట్లు లేకపోయినా.. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉందన్నారు. వైసీపీ, టీడీపీ బలం కూడా కేంద్రానికే ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని.. అసలు అవిశ్వాస తీర్మానాన్ని గట్టిగా ఎక్స్‌పోజ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేయాలని అన్నారు. అవిశ్వాస తీర్మానంలో మీ వాదనని గట్టిగా వినిపించాలని.. కేంద్రానికి ఇంత త్వరగా సరెండర్ అయిపోవల్సిన అవసరం లేదని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం మీకు తెలిసినా.. ఎందుకు అడగలేకపోతున్నారని ప్రశ్నించారు. రూ.4117 కోట్లు మాత్రమే రెవిన్యూ డెఫిషిట్‌గా కేంద్రం మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూ వచ్చిందని.. మొన్న మాత్రం పదివేల కోట్లు మంజూరు చేశారని అన్నారు. కేంద్రం చెప్పిన మాట వింటే.. ఇష్టారీతిన నిధులు విడుదల చేస్తారన్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి 35 వేల కోట్లు రెవిన్యూ డిఫిషిట్ రావాలని అడిగారని వెల్లడించారు.

Diabeties Control : వారంలో 3 సార్లు తాగితే చాలు .. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది..

సీఎం జగన్, చంద్రబాబు కూడా కేంద్రానికి పూర్తిగా సరెండర్ అయ్యారనే భావన కనిపిస్తుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బుందేల్ఖండ్‌కి ఏ ప్రాతిపతికన సహాయం చేశారో.. అదే ప్రాతిపదికన చేస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.24,350 కోట్లు అని తెలిపారు. టాక్స్ బెనిఫిట్ పెద్దఎత్తున రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. వీటి గురించి గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని నిలదీశారు. రాష్ట్ర విభజన దారుణమైన స్థితిలో జరిగిందని.. షోరూం తెలంగాణకు వస్తే, గోడౌన్ మాత్రమే ఆంధ్రకు వచ్చిందని అభివర్ణించారు. ఆదాయం అంతా తెలంగాణకే లభిస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానంలో అన్ని విషయాలు మాట్లాడాలని, ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించారు. 20-21లో నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుండి 6 ప్రాజెక్టులు వచ్చాయని, వాటిని ఆదానికి అప్పజెప్పారని అన్నారు. ఎన్‌హెచ్‌పీసీ లాంటి అగ్రిమెంట్లను ప్రైవేటుకు అప్పచెప్పటం సరికాదన్నారు. ఫైర్ సర్వీసెస్ సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన నిబంధన తొలగించే ప్రయత్నం చేస్తుందని తెలిసిందని.. అది ఏమాత్రం సరికాదని హెచ్చరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandrababu Naidu
  • PM Narendra Modi
  • Polavaram project
  • Undavalli Arun Kumar
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Bhatti Vikramarka : 10 ఏళ్లు వెనుకపడ్డాం.. ఇప్పుడు పరుగులు పెట్టక తప్పదు

  • YS Jagan: మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్‌.. గాయపడిన వృద్ధురాలిని..!

  • Ileana D’Cruz: మళ్లీ తల్లికాబోతున్న హీరోయిన్.. నెట్టింట బేబీ బంప్ ఫోటో వైరల్..!

  • Nadendla Manohar: ఆదివారాల్లో కూడా రేషన్ షాపులు.. జూన్ 1 నుంచి సరుకులు పంపిణీ!

  • Alleti Maheshwar Reddy : కవిత అసంతృప్తి.. BRS పతనానికి నిదర్శనం

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions