Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana On Govt Employees Transfer: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీకి అర్హులుగా ప్రకటించింది. అలాగే.. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా రిక్వెస్ట్పై బదిలీకి అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బదిలీలు, ప్రమోషన్లపై ఇవాళ చర్చించామని చెప్పిన ఆయన.. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు నిర్వహిస్తామని, ఆ తర్వాతే ప్రమోషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎంఈఓ-2 పోస్టులు 678 నియామక జీఓ రేపటి నుంచే సిద్ధం చేస్తామని.. 350 గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, పీజీ టీచర్ల నియాకాలను సైతం రేపటి నుంచి ప్రారంభిస్తామని అన్నారు.
Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
Also Read
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ప్రొమోషన్లు, బదిలీలపై స్ధిరమైన నిర్ణయం తీసుకున్నామన్న బొత్స సత్యనారాయణ.. పాత పాయింట్ల ప్రకారమే, తాము కోరిన టీచర్ల డిమాండ్ను సంతృప్తిపరిచామన్నారు. టీచర్లు, లెక్చరర్ల జీఓ స్కూళ్లు ప్రారంభించేలోగా ఇస్తామన్నారు. టీచర్ల యూనియన్ల అంగీకారంతోనే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రేపట్నుంచే బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. 1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా రేపట్నుంచే ప్రారంభిస్తామని, 6249 మంది ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తామని తెలియజేశారు. 117 జివో ద్వారా ప్రభావితం అయిన వారికి అదనంగా 5 పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు కేటాయిస్తామన్నారు. ఈ వ్యవహారంలో ఇతరులు దయచేసి వివాదాలు సృష్టించొద్దని, ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు.. ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యాకే.. ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..
అనంతరం ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సమస్యలను తెలియజేశామని, వాటి పరిష్కరించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పదోన్నతలకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 2015-17లలో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి, బదిలీలు చేస్తున్నారని వెల్లడించారు. పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని తెలిపారు.
తాజావార్తలు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
-
Jai Moondra: టీమిండియాపై చెలరేగాడు.. బంపర్ ఛాన్స్ కొట్టేశాడు.. జయహో జై ముంద్రా!
-
Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
-
Revolt RVX: రివోల్ట్ నుంచి కొత్త RVX ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. 160KM రేంజ్, 90kmph టాప్ స్పీడ్
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!