Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
Botsa Satyanarayana On Govt Employees Transfer: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీకి అర్హులుగా ప్రకటించింది. అలాగే.. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా రిక్వెస్ట్పై బదిలీకి అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బదిలీలు, ప్రమోషన్లపై ఇవాళ చర్చించామని చెప్పిన ఆయన.. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు నిర్వహిస్తామని, ఆ తర్వాతే ప్రమోషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎంఈఓ-2 పోస్టులు 678 నియామక జీఓ రేపటి నుంచే సిద్ధం చేస్తామని.. 350 గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, పీజీ టీచర్ల నియాకాలను సైతం రేపటి నుంచి ప్రారంభిస్తామని అన్నారు.
Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ప్రొమోషన్లు, బదిలీలపై స్ధిరమైన నిర్ణయం తీసుకున్నామన్న బొత్స సత్యనారాయణ.. పాత పాయింట్ల ప్రకారమే, తాము కోరిన టీచర్ల డిమాండ్ను సంతృప్తిపరిచామన్నారు. టీచర్లు, లెక్చరర్ల జీఓ స్కూళ్లు ప్రారంభించేలోగా ఇస్తామన్నారు. టీచర్ల యూనియన్ల అంగీకారంతోనే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రేపట్నుంచే బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. 1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా రేపట్నుంచే ప్రారంభిస్తామని, 6249 మంది ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తామని తెలియజేశారు. 117 జివో ద్వారా ప్రభావితం అయిన వారికి అదనంగా 5 పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు కేటాయిస్తామన్నారు. ఈ వ్యవహారంలో ఇతరులు దయచేసి వివాదాలు సృష్టించొద్దని, ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు.. ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యాకే.. ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..
అనంతరం ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సమస్యలను తెలియజేశామని, వాటి పరిష్కరించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పదోన్నతలకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 2015-17లలో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి, బదిలీలు చేస్తున్నారని వెల్లడించారు. పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని తెలిపారు.
తాజావార్తలు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
-
Imran Khan: 85% చూపు కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్.. వైద్య కారణాలతో విడుదల కోరుతూ కోర్టుకు అప్పీల్
-
Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!