Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana On Govt Employees Transfer: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీకి అర్హులుగా ప్రకటించింది. అలాగే.. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా రిక్వెస్ట్పై బదిలీకి అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బదిలీలు, ప్రమోషన్లపై ఇవాళ చర్చించామని చెప్పిన ఆయన.. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు నిర్వహిస్తామని, ఆ తర్వాతే ప్రమోషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎంఈఓ-2 పోస్టులు 678 నియామక జీఓ రేపటి నుంచే సిద్ధం చేస్తామని.. 350 గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, పీజీ టీచర్ల నియాకాలను సైతం రేపటి నుంచి ప్రారంభిస్తామని అన్నారు.
Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : సైలెంట్ మోడ్ లో కాకినాడ జిల్లా వైసీపీ సీనియర్స్
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ప్రొమోషన్లు, బదిలీలపై స్ధిరమైన నిర్ణయం తీసుకున్నామన్న బొత్స సత్యనారాయణ.. పాత పాయింట్ల ప్రకారమే, తాము కోరిన టీచర్ల డిమాండ్ను సంతృప్తిపరిచామన్నారు. టీచర్లు, లెక్చరర్ల జీఓ స్కూళ్లు ప్రారంభించేలోగా ఇస్తామన్నారు. టీచర్ల యూనియన్ల అంగీకారంతోనే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రేపట్నుంచే బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. 1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా రేపట్నుంచే ప్రారంభిస్తామని, 6249 మంది ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తామని తెలియజేశారు. 117 జివో ద్వారా ప్రభావితం అయిన వారికి అదనంగా 5 పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు కేటాయిస్తామన్నారు. ఈ వ్యవహారంలో ఇతరులు దయచేసి వివాదాలు సృష్టించొద్దని, ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు.. ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యాకే.. ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..
అనంతరం ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సమస్యలను తెలియజేశామని, వాటి పరిష్కరించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పదోన్నతలకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 2015-17లలో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి, బదిలీలు చేస్తున్నారని వెల్లడించారు. పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!