Botsa Satyanarayana: పారదర్శకంగా బదిలీ చేస్తాం.. తర్వాత ప్రమోషన్లు ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana On Govt Employees Transfer: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 22 తేదీ నుంచి 31 తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. 2023 ఏప్రిల్ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులను బదిలీకి అర్హులుగా ప్రకటించింది. అలాగే.. రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి కూడా రిక్వెస్ట్పై బదిలీకి అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. బదిలీలు, ప్రమోషన్లపై ఇవాళ చర్చించామని చెప్పిన ఆయన.. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు నిర్వహిస్తామని, ఆ తర్వాతే ప్రమోషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎంఈఓ-2 పోస్టులు 678 నియామక జీఓ రేపటి నుంచే సిద్ధం చేస్తామని.. 350 గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, పీజీ టీచర్ల నియాకాలను సైతం రేపటి నుంచి ప్రారంభిస్తామని అన్నారు.
Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
ప్రొమోషన్లు, బదిలీలపై స్ధిరమైన నిర్ణయం తీసుకున్నామన్న బొత్స సత్యనారాయణ.. పాత పాయింట్ల ప్రకారమే, తాము కోరిన టీచర్ల డిమాండ్ను సంతృప్తిపరిచామన్నారు. టీచర్లు, లెక్చరర్ల జీఓ స్కూళ్లు ప్రారంభించేలోగా ఇస్తామన్నారు. టీచర్ల యూనియన్ల అంగీకారంతోనే ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. రేపట్నుంచే బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. 1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా రేపట్నుంచే ప్రారంభిస్తామని, 6249 మంది ఎస్జీటీ టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తామని తెలియజేశారు. 117 జివో ద్వారా ప్రభావితం అయిన వారికి అదనంగా 5 పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు కేటాయిస్తామన్నారు. ఈ వ్యవహారంలో ఇతరులు దయచేసి వివాదాలు సృష్టించొద్దని, ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు.. ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. బదిలీల ప్రక్రియ పూర్తయ్యాకే.. ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..
అనంతరం ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగిందన్నారు. స్కూల్ అసిస్టెంట్ల సమస్యలను తెలియజేశామని, వాటి పరిష్కరించాలని కోరామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. పదోన్నతలకు కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. 2015-17లలో ఉన్న జీఓలలో చిన్న మార్పులు చేసి, బదిలీలు చేస్తున్నారని వెల్లడించారు. పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించారని తెలిపారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!