Botsa Satyanarayana: వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మూడురాజధానులపై మరోసారి తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాలు పెట్టాం.. 29 గ్రామాలు, ఒక ప్రాంతం, ఒక వర్గం కోసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. 2019 నాటికి లక్ష 9 వేలు కోట్లు రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. శివరామకృష్ణన్ కమిటీ కి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదు. ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందన్నారు.
Read Also: football match: గాల్లోనే ఆటగాళ్ల గోల్స్.. 20వేల అడుగుల ఎత్తులో ఫుట్ బాల్ మ్యాచ్
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
రాష్ట్ర సంపద ల్యాండ్ పూలింగ్ పేరుతో 29 గ్రామాల్లో పెట్టారు. ల్యాండ్ ఇచ్చిన వారికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం చేస్తాము.. మనం కళ్ళు తెరిచే టైం కి రాష్ట్ర విభజన జరిగిపోయింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు,దొంగలు, దోపిడిదారులు పాద యాత్ర గా వస్తున్నారు.. రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది..జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలి. చంద్రబాబు కి , లోకేష్ కి జై అని పాదయాత్ర మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కష్టాన్ని 29 గ్రామాల గోతులలో పోయాలి అంటున్నారు. తెలుగుదేశం ప్రజలు అభిమానం కోల్పోయిన పార్టీ, వారి ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు మంత్రి బొత్స.
ఐదు కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి? మన దేవుడి దగ్గరకి వచ్చి శాపాలు పెడతారా? ఇదెక్కడి చోద్యం. 29 గ్రామాలు రియల్ ఎస్టేట్ కోసం, ఒక పార్టీ మనుగడ కోసం యాత్ర చేస్తున్నారు. పాదయాత్ర కావాలంటే ఐదు నిమిషాలు చాలని కానీ అది సాంప్రదాయం కాదని చెప్తే నా మాటలు వక్రీకరించారు. ఇక్కడే రాజధాని కడతామని అగ్రిమెంట్ ఇవ్వలేదు. ఐదు కోట్ల ప్రజలు డబ్బులు ఆ మట్టి లో పోస్తే 29 గ్రామాల నుంచి మీరు సంపాదిస్తారా? రైతులు ముసుగులో టీ డీ పీ చేస్తున్న పాదయాత్ర కి బుద్ధి చెప్పాలన్నారు. పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలి. దుష్ట శక్తులు, దుర్మార్గులు ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు రాజధాని విశాఖ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి వహిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి బొత్స.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!