Pawan kalyan Delhi Tour: అలర్ట్ అయిన బీజేపీ.. ఢిల్లీ నుంచి పవన్కు పిలుపు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందనే ప్రచారం సాగుతోంది.. తన విశాఖ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై సీరియస్గా స్పందించిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి పోం.. ఇక్కడే తేల్చుకుంటాం అని ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే.. హస్తిన నుంచి పవన్కు పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది.. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలతో పవన్ కల్యాణ్ను ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం జనసేనాని హైదరాబాద్లో ఉన్నారు.. దీంతో, ఆయన ఢిల్లీ వెళ్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.. మరోవైపు.. భారతీయ జనతా పార్టీతో గ్యాప్ ఉందని ఇటీవలే కామెంట్ చేశారు పవన్… రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ను కోరిన తనపై విమర్శలు కూడా వచ్చాయని గుర్తుచేసుకున్నారు.. అయితే, ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. దీంతో, పవన్ హస్తినకు వెళ్తారా? వెళ్తే.. బీజేపీతో ఎలాంటి విషయాలపై చర్చ జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది.
Read Also: JanaSena: జనసేన నేతలకు షాకిచ్చిన కోర్టు..
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
అయితే, తాజాగా, పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. కమలానికి జనసేన కటీఫ్ చెప్పినట్టే అనే సంకేతాలు ఇచ్చాయి.. బీజేపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్.. బీజేపీ తనకు ఇప్పటికీ వైసీపీ పోరాటం విషయంలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదన్నారు. ఇంకెంత కాలం వెయిట్ చేయాలంటూ ప్రశ్నించారు. అందుకే తాను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చిందని.. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖ చిత్రం చూస్తారంటూ కామెంట్ చేశారు.. ఇంత పెద్ద జనసేన పార్టీ పెట్టుకుని, ప్రాణాలిచ్చే లక్షలాది మంది కార్యకర్తలు ఉండి.. తాను బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడగడం ఏంటని.. అసలు తనకు సిగ్గు ఉందా అంటూ ఉండవల్లి తనను తిడుతూ ఉంటారన్నారు. కానీ, తానేమీ ఆ తిట్లకు బాధపడడం లేదన్నారు. ఎందుకంటే పెద్ద వాళ్లు తిడితే ఆశీస్సులా తీసుకుంటా. బీజేపీ మీద తనకు గౌరవం ఉంది. అలా అని చెప్పి తన స్థాయిని చంపుకోలేను.. ఊడిగం చేయలేనని ఘాటుగా స్పందించారు పవన్.
ఇక, జనసేనాని హాట్ కామెంట్లు చేసిన కొద్ది క్షణాల్లోనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.. విజయవాడలో పవన్ బస చేసిన హోటల్కు వెళ్లి ఆయన్ను పరామర్శించారు దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు.. ప్రభుత్వ విధానాలపై కలిసికట్టుగా పోరాటం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.. ఇదే సమయంలో.. టీడీపీ-జనసేన దగ్గర అయినట్టే.. మళ్లీ కలిసి పోటీచేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.. చంద్రబాబు-పవన్ అంతసేపు మాట్లాడారంటే.. ఏదో కీలకమైన నిర్ణయానికే వచ్చిఉంటారని.. ఏపీ రాజకీయాల్లో ఏదైనా జరుగొచ్చు అనే చర్చ హాట్ టాపిక్గా మారింది.. అయితే, పవన్ కల్యాణ్ చేజారిపోయే ప్రమాదం ఉందని భావించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు.. వెంటనే ఆయన్ను హస్తినకు రావాలని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. మరి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!