GVL Narasimha Rao: భూదోపిడీలో వైసీపీ, టీడీపీ నేతలు తోడుదొంగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL NarasimhaRao: విశాఖలో భూకబ్జాలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు వైసీపీ, టీడీపీలకు ఆయన ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, విశాఖ భూ కబ్జాలపై వైసీపీ, టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. త్వరలోనే బహిరంగ చర్చకు పిలుస్తామని.. సిద్ధంగా ఉండాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంటే వైసీపీ, టీడీపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నాయని.. పోలవరం నిర్మాణం ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వం చేతకానితనం కారణమని ఎద్దేవా చేశారు. కేంద్రం నిధులిస్తే ప్రాజెక్ట్ ప్రారంభించిన చంద్రబాబు కమిషన్ల కోసం పోలవరం తీసుకున్నారని.. 14ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా రాలేదని ఆరోపించారు.
విశాఖ భూ దోపిడీలో టీడీపీ, వైసీపీ తోడు దొంగలు అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర విమర్శలు చేశారు. రెండు సిట్లు ఏర్పాటు చేసినా ఎందుకు నివేదికలు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రబాబు మధ్య ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. భూదోపిడీలో వైసీపీ, టీడీపీ భాగస్వాములు అయ్యాయని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో వైజాగ్ భూ స్కాంపై ప్రస్తావించి దేశం మొత్తం తెలిసే విధంగా చేస్తామన్నారు. గతంలో భూ స్కాంలపై మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఎందుకు సైలెంట్ అయ్యారో చెప్పాలన్నారు. గతంలో భూముల గురించి మాట్లాడి ఇప్పుడు మౌనం పాటిస్తున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధిని అనుమానించాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి విశాఖలో 5జీ సేవలు ప్రారంభించేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. విశాఖ నుంచి మూడు వందే భారత్ రైళ్లు నడపించాలని కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టామని జీవీఎల్ తెలిపారు.
Also Read
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
Read Also: Tirumala: శ్రీవారికి కాసులే కాసులు.. వరుసగా 9వ నెల కూడా రికార్డు..!!
అటు విశాఖలో ఇటీవల ప్రధాని మోదీ పర్యటనకు అయిన ఖర్చులో సింహభాగం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఖర్చు పెట్టిందని.. సభ నిర్వహణ మొత్తం తామే చేశామని ఎవరైనా ప్రచారం చేసుకుంటే దుస్సాహసమే అవుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. జనసేన, బీజేపీ భాగస్వామ్యం కంఫర్టబుల్గా ఉందని తెలిపారు. తమ పొత్తును చూసి మిగిలిన రాజకీయపార్టీల్లో గుబులు పట్టుకుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తరచూ బీజేపీ ముఖ్యులతో సమావేశం అవుతూనే ఉన్నారని జీవీఎల్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!