Anil Kumar Yadav Controversy: వివాదంలో మాజీ మంత్రి అనిల్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జలవనరుల శాఖ మంత్రిగా వున్నప్పుడు తనదైన రీతిలో విపక్షాలపై విరుచుకుపడేవారు అనిల్ కుమార్ యాదవ్. మాజీ మంత్రి అయ్యాక ఆయనలో దూకుడు తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. పవిత్రమైన అయ్యప్పస్వామి మాల వేసుకుని ఓట్ల కోసం మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇది ఎంతవరకు సబవని బీజేవైఎం నేతలు ప్రశ్నించారు. అనిల్ తీరుకు నిరసనగా నెల్లూరు నగరం ఇస్కాన్ సిటీలోని అనిల్ కుమార్ యాదవ్ ఇంటిని ముట్టడించారు.

Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
హిందువుల మనోభావాలను కించపరుస్తున్న ఎమ్మెల్యే అనిల్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయ్యప్ప మాల వేసుకుని ముస్లిం లాగా తలపై టోపీ పెట్టుకుని మసీదు లోకి ఏ విధంగా వెళ్తారని వారంతా ప్రశ్నించారు. అనిల్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇస్కాన్ సిటీలోని మాజీ మంత్రి అనిల్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్పమాలలో ఉంటూ.. మాజీ మంత్రి అనిల్ ముస్లిం ప్రార్దనలలో పాల్గొన్నారని బీజేవైఎం నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల కోసం అయ్యప్పమాలను వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. హింందువులకు, అయ్యప్ప భక్తులకు అనిల్ క్షమాపణ చెప్పాలని బిజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Radhika Sharathkumar: దేవుడా.. సూపర్ స్టార్ ను పట్టుకొని అంత మాట అనేసిందేంటి..?
నెల్లూరులోని ఖుద్దూస్ నగర్ లో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ ఇంటింటికీ తిరిగారు. అయితే, ఆయన స్థానిక ప్రజల మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనిల్ తీరుని తప్పుబట్టారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు హిందువులు సహించరని జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ, హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్పమాల దీక్షను అవమానపరిచిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీక్షాపరులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసీపీ నేత బరితెగించడం సిగ్గుచేటు అని విష్ణు విమర్శించారు. ఇలాంటివి హిందూ సమాజం క్షమించదని బీజేపీ హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యే అనిల్ ను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అనిల్ కుమార్ యాదవ్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం లేదని బీజేపీ. హిందూత్వవాదులు మండిపడుతున్నారు.
Read Also: Minister KTR : హైదరాబాద్ వాసులకు శుభవార్త.. త్వరలోనే మెట్రో రెండో ఫేజ్
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!