సిరిమాను సంబరంలో ట్విస్ట్లు.. వాళ్ళిద్దరూ దూరం!
సిరిమాను సంబరానికి అంతా సిద్ధమయింది, ఉత్తరాంధ్ర కల్పవల్లి పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి విజయనగరం జిల్లా ముస్తాబైంది. కరోనా కారణంగా పైడిమాంబ ఉత్సవాలను గతంలోలా కాకుండా చాలా సాదాసీదాగా జరపనున్నారు. రెండో ఏడాదీ భక్తులు లేకుండానే అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని కనులారా వీక్షించే అవకాశం లేకుండా పోయిందని భక్తులు వాపోతున్నారు.
ఇదిలా వుంటే.. సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధం అయింది. కోట బురుజుపై చేరుకున్నారు రాజవంశీయులు అశోక్ గజపతి రాజు కుటుంబసభ్యులు. కోట బురుజు పైకి వచ్చారు ఆనంద్ గజపతి రెండవ భార్య సుధా గజపతి. ఊర్మిళ మాత్రం అందుబాటులో లేరు. మాన్సస్ మాజీ చైర్ పర్సన్ సంచయిత సంబరానికి దూరంగా వుండడం చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానం లేనందునే దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
పైడితల్లి అమ్మ వారి ఉత్సవాలకు భక్తుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రజా రవాణాను నిలిపివేయటంతో పాటు వ్యాపార సముదాయాలను కూడా మూసివేశారు. సిరిమానుతో పాటు వెంట తిరిగే వివిధ రథాల వెనుక వాలంటీర్లను మాత్రమే అనుమతించనున్నారు. వీటితోపాటు ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సిరిమాను సంబరానికి పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేసింది. సుమారు 2 వేల 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇతర ప్రాంతాల ప్రజలు విజయనగరంలోకి ప్రవేశించకుండా పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించారు.అమ్మవారి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలైన పులివేషాలు, ఘటాల ప్రదర్శనను సైతం నిషేధించారు. ప్రతీ వార్డుకు రెండు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి అమ్మవారి పూజలు, సిరిమానోత్సవాన్ని ప్రజలు వీక్షించే అవకాశం కల్పించారు.
తాజావార్తలు
-
Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
-
MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!