సిరిమాను సంబరంలో ట్విస్ట్లు.. వాళ్ళిద్దరూ దూరం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరిమాను సంబరానికి అంతా సిద్ధమయింది, ఉత్తరాంధ్ర కల్పవల్లి పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి విజయనగరం జిల్లా ముస్తాబైంది. కరోనా కారణంగా పైడిమాంబ ఉత్సవాలను గతంలోలా కాకుండా చాలా సాదాసీదాగా జరపనున్నారు. రెండో ఏడాదీ భక్తులు లేకుండానే అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. అమ్మవారిని కనులారా వీక్షించే అవకాశం లేకుండా పోయిందని భక్తులు వాపోతున్నారు.
ఇదిలా వుంటే.. సిరిమాను ఊరేగింపునకు సర్వం సిద్ధం అయింది. కోట బురుజుపై చేరుకున్నారు రాజవంశీయులు అశోక్ గజపతి రాజు కుటుంబసభ్యులు. కోట బురుజు పైకి వచ్చారు ఆనంద్ గజపతి రెండవ భార్య సుధా గజపతి. ఊర్మిళ మాత్రం అందుబాటులో లేరు. మాన్సస్ మాజీ చైర్ పర్సన్ సంచయిత సంబరానికి దూరంగా వుండడం చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానం లేనందునే దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
పైడితల్లి అమ్మ వారి ఉత్సవాలకు భక్తుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రజా రవాణాను నిలిపివేయటంతో పాటు వ్యాపార సముదాయాలను కూడా మూసివేశారు. సిరిమానుతో పాటు వెంట తిరిగే వివిధ రథాల వెనుక వాలంటీర్లను మాత్రమే అనుమతించనున్నారు. వీటితోపాటు ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.సిరిమాను సంబరానికి పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేసింది. సుమారు 2 వేల 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇతర ప్రాంతాల ప్రజలు విజయనగరంలోకి ప్రవేశించకుండా పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించారు.అమ్మవారి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలైన పులివేషాలు, ఘటాల ప్రదర్శనను సైతం నిషేధించారు. ప్రతీ వార్డుకు రెండు ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి అమ్మవారి పూజలు, సిరిమానోత్సవాన్ని ప్రజలు వీక్షించే అవకాశం కల్పించారు.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!