Andhra Pradesh: యువతి మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెల్ఫీ వీడియో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twist in Missing Case: చిత్తూరు జిల్లా తెలుగు గంగ కాలువలో యువతి మృతదేహం లభ్యం ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. చనిపోయిందని భావించిన యువతి వీడియోలో ప్రత్యక్షమైంది. హత్య చేశాడని అనుమానించిన యువకుడితోనే వీడియోలో యువతి కనిపించింది. శ్రీకాళహస్తిలోని రామాపురం గ్రామానికి చెందిన చంద్రిత అనే యువతి ఈ ఏడాది జనవరి నుంచి మిస్సింగ్ అయ్యింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన వాలంటీర్ చంద్రశేఖర్తో యువతి చంద్రిత ప్రేమాయణం నడిపింది. తమ కుమార్తె చంద్రితను ప్రేమ పేరిట మోసం చేసిన వాలంటీర్ చంద్రశేఖర్ చంపేశాడని తల్లిదండ్రులు కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం తెలుగు గంగ కాలవలో గుర్తుపట్టలేని స్థితిలో యువతి మృతదేహం లభ్యం కాగా అందరూ ఆ శవం చంద్రితదే అని భావించారు.
మరోవైపు ఏర్పేడు వద్ద చెరువులో మరో యువకుడి మృతదేహం లభ్యమైంది. తెలుగు గంగ కాలువలో లభించినది చంద్రిత మృతదేహం అని భావించి దోషులను పట్టుకోవాలని మూడు రోజుల క్రితం శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మరోవైపు ఏర్పేడు చెరువులో లభించినది తమ కుమారుడు చంద్రశేఖర్ అని భావించి, తమ వాడిని కొట్టి చంపేశారని కుటుంబీకులు ఆందోళనకు దిగారు.
Also Read
Read Also: దేశంలోని 10 అందమైన్ బీచ్లు.. తప్పకుండా సందర్శించాల్సిందే!
అయితే మొత్తం వ్యవహారంలో ఆదివారం బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రశేఖర్, చంద్రిత కలిసి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తాము ఇద్దరం ఒక చోట సంతోషంగా ఉన్నామని, అనవసరంగా తమ గురించి గొడవలు పడవద్దు అంటూ వీడియోలో పేర్కొన్నారు. తనను హంతుకుడిగా చిత్రీకరించారని టీడీపీ, జనసేన నేతలపై చంద్రశేఖర్ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రేమించానన్న కారణంగా తల్లిదండ్రులు తనను హింసించారని చంద్రిత వీడియోలో చెప్పింది. వీళ్లిద్దరి సెల్ఫీ వీడియో విడుదల కావడంతో శ్రీకాళహస్తి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వీళ్లు ఎక్కడ ఉన్నారన్న వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..