Bhumana Karunakar Reddy: రాజకీయం వద్దు.. రాయలసీమకు ద్రోహం చేయొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు రాజధానులపై ముందుకు వెళ్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ప్రజల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలతో విశాఖ గర్జన జరగగా.. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనూ ఉ్యమానికి శ్రీకారం చుట్టింది… తిరుపతి వేదికగా మహా ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ఫ్లెక్సీలు ఆవిష్కరించారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికి జరగదు, రాయలసీమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం.. పదండి.. అంటూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. రాయలసీమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రజలు అందరూ సంఘీభావం ప్రకటించేందుకు సిద్దంగా ఉన్నారన్న భూమన.. పరిపాలన వికేంద్రీకరణకు విద్యార్థులు, ప్రజలు.. సీఎం వైఎస్ జన్మోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు.
Read Also: Farmhouse MLA Audio Leak: ఫామ్ హౌస్ ఘటనలో బయటికొచ్చిన సంచలన ఆడియో
Also Read
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
రాయలసీమ ఆత్మగౌరవం యాత్రకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం… కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు దీనిని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు భూమన కరుణాకర్రెడ్డి.. ఇలాంటి విషయాల్లో రాజకీయం సరికాదు.. రాయలసీమకు ద్రోహం చేయొద్దు అని హితవుపలికారు.. ఇక, ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీ యాజమాన్యాలు స్వచ్ఛందంగా ఈ మహా ప్రదర్శనలు పాల్గొంటాయని వెల్లడించారు.. కాగా, ఈనెల 29వ తేదీన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో ఆత్మ గౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. రాయలసీమ గొంతును మహా ప్రదర్శన ద్వారా చాటిచేబుదాం.. రాయలసీమకు న్యాయ రాజధాని కావాలి… అప్పుడే వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుందంటున్నారు.. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగా వెనుకపడ్డాయి.. అందుకే సీఎం వైఎస్ జగన్.. మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? కేవలం రూ.1,000 పెట్టుబడితో సొంత బిజినెస్.. నెలకు లక్షల్లో ఆదాయం!
-
Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!