Robbery: దుండగుల హల్చల్.. పోలీసులమంటూ 80 లక్షల దోపిడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru Police Arrested Three Men For Robbery In AP Police Dress: ఆ ముఠాలో మొత్తం ముగ్గురు ఉన్నారు. చెడు వ్యసనాలకు అలవాటుపడ్డ వీళ్లు.. డబ్బులు సంపాదించడానికి దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజలకు టోకరా వేసి.. ఏకంగా రూ. 80 లక్షలు దోచేసుకున్నారు. అదికూడా తాము పోలీసులమని అబద్ధం చెప్పి, ఈ దోపిడీకి పాల్పడ్డారు. చివరికి వీరి పప్పులు ఉడకపోవడంతో.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Inorbit Mall: అటు వెళ్లకండి.. వెళ్తే మాత్రం ఇరుక్కుంటారు జాగ్రత్త
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
ఆ ముగ్గురు దుండుగల పేర్లు.. బత్తుల శివరామకృష్ణ యాదవ్ (19), షేక్ చెంపతి లాల్ బాషా, షేక్ చెంపతి జాకిర్(27). ఆంధ్రప్రదేశ్కి చెందిన వీళ్లు.. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. తమ అవసరాల కోసం డబ్బులు సంపాదించడానికి.. దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎన్నో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే వీళ్లు ఇటీవల కుమారస్వామి, చందన్ అనే ఇద్దరు వ్యాపారుల్ని బెదిరించి.. వారి వద్ద నుంచిరూ. 80 లక్షలు దోచుకున్నారు. ఏపీ పోలీసుల తరహాలో దుస్తులు ధరించి బెదిరించడంతో.. ఆ వ్యాపారులు భయపడిపోయి డబ్బులు ఇచ్చేశారు. అనంతరం ఆ వ్యాపారులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ముగ్గురిని చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేశారు.
Space Debris: ఆకాశంలో ‘చెత్త’.. ప్రపంచదేశాలకు సవాల్
ఈ కేసు వివరాల్ని డీసీపీ శ్రీనివాస్ గౌడ వెల్లడిస్తూ.. పోలీసుల దుస్తులు ధరించి, ఆ వ్యాపారుల నుంచి ఈ దుండగులు రూ. 80 లక్షలు జప్తు చేసుకున్నారన్నారు. దోచుకున్న నగదుతో బెంగళూరు మెజెస్టిక్ సమీపంలోని ఒక హోటల్లో జూదం ఆడారు. తొలుత రూ.కోటి గెల్చుకున్న వీళ్లు.. కొద్ది గంటల్లోనే ఆ నగదును ఓడిపోయారు. మిగిలిన నగదుతో అక్కడి నుంచి పరారయ్యారు. చిత్తూరులో ఉన్నారని సమాచారం తెలిసి, అక్కడ అరెస్ట్ చేశామన్నారు. వీరిపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దారి దోపిడీలు, దొంగతనాలు, ఎర్రచందనం తరలింపు తదితర 80కుపైగా కేసులు ఉన్నాయని తాము గుర్తించామన్నారు.
Divyansha Kaushik: ఐ లవ్ నాగచైతన్య.. బాంబ్ పేల్చిన ‘మజిలీ’ బ్యూటీ
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!