Chandrababu: ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నీ పని, నీ పార్టీ పని ఫినిష్ అని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే నీకు నిద్ర పట్టదు.. నీ అవినీతి డబ్బు, అధికార దుర్వినియోగం ఆపుతుందా అని దుయ్యబట్టారు. ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సభ కోసమని.. సభా ప్రాంగణానికి ఓ రైతు భూమి ఇస్తే నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. మీటింగ్ జరగటానికి వీలు లేదు అంటారా.. మేము చట్ట ప్రకారం పోతున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు జగన్ రెడ్డికి అభ్యర్ధులు దొరక్క సందిగ్ధంలో పడిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ భవిష్యత్తు కోసం నేను ఇక్కడకు వచ్చాను.. మీ స్పందన చూస్తుంటే నాకు ముందే గెలుపు కనిపిస్తుందని అక్కడి జనాలను చూసి చంద్రబాబు మాట్లాడారు. అందరం జాగ్రత్తగా ఉండకపోతే ఈ రావణాసురిడితో కష్టమని ఆరోపించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అధికారం అడ్డం పెట్టుకుని 43 వేల కోట్లు దోచుకున్నాడని దుయ్యబట్టారు. ఊరూరా తిరిగి ముద్దులు పెట్టాడు.. తల నిమిరాడు.. అందరూ కరిగిపోయారన్నారు. ముఖ్యమంత్రి అయ్యాడు.. రాష్ట్రాన్ని చెరబట్టాడు.. వ్యవస్థలు మొత్తాన్ని సర్వనాశనం చేశాడని తెలిపారు.
Also Read
- Digital Arrest Scam: బాపట్లలో రిటైర్డ్ టీచర్ డిజిటల్ అరెస్ట్.. రూ.60 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..
- CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..
- Land Dispute: బాపట్ల ఎస్పీ ఫ్యామిలీ భూకబ్జా.. కొనసాగుతున్న విచారణ
- Minister Nadendla: రైతులు పడ్డ కష్టానికి ప్రభుత్వం గుర్తింపు ఇస్తుంది..
జగన్ రెడ్డి ఆయన అన్నం తినటం మానేశాడు.. ఉదయం అల్పాహారం ఇసుక, మధ్యాహ్నం భోజనం మైన్స్, రాత్రి డిన్నర్ జే బ్రాండ్ మద్యం సేవిస్తున్నారని విమర్శించారు. కప్పం చెల్లించకపోతే గ్రానైట్ పరిశ్రమ యజమానులపై కేసులు పెట్టారు.. మైనింగ్ అధికారులు కారం పట్టుకుని ఫ్యాక్టరీల చుట్టూ తిరుగుతున్నారు.. అధికారం ఉందని అంబోతుల్లా ఊరి మీద పడ్డారని తెలిపారు. ఆంబోతులకు కళ్లెం వేసి ఆపుతానని పేర్కొన్నారు. మరోవైపు.. పార్టీ మారలేదని అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ పై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. తాను, పవన్ కళ్యాణ్ సహా అందరూ బాధితులమే.. దోపిడీ తప్పంటే మనపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!