Atchannaidu: జగన్ పాలనలో తీవ్ర సంక్షోభంలోకి వ్యవసాయ రంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టినప్పటి నుంచి.. ఆంధ్ర రాజకీయాలు వ్యవసాయ రంగం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, టీడీపీ పార్టీలు సైతం.. ఈ సందర్భంగా కార్యక్రమాలు, కమిటీల్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా టీడీపీ ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట ఓ కమిటీని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ మూడేళ్ళ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు.
పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము రాష్ట్రంలోని అన్నదాతల్ని ఆదుకోవడానికి టీడీపీ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం పేరుతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటిస్తుందని, రైతులకు న్యాయం జరిగే పోరాడుతుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Also Read
కాగా.. ఈ కమిటీలో సభ్యులుగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కూన రవికుమార్, తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిలను నియమించారు.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?