AP Weather Update: ఏపీలో రానున్న 5 రోజులు వింత వాతావరణం..
- ఏపీలో మిశ్రమ వాతావరణం.. వర్షం, ఎండల కలయిక
- ఉరుములు, మెరుపులతో వర్షాలకు ఐఎండీ హెచ్చరిక
- ఈదురుగాలులు పెరుగుతాయి.. గాలి వేగం 50 కిమీ వరకు
- రైతులు, ప్రజలకు ముఖ్య సూచనలు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు మిశ్రమ వాతావరణం ఉండబోతోందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. రాష్ట్రంలో ద్రోణి బలహీనపడినప్పటికీ, సముద్రం నుంచి వస్తున్న తేమగాలుల ప్రభావం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరగనుండటం గమనార్హం.
10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
- Pawan Kalyan: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు లక్ష్యం.. జల్ జీవన్ మిషన్పై పవన్ కీలక ఆదేశాలు
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
సముద్రం నుంచి వీస్తున్న తేమగాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర , దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మొదటి మూడు రోజులు గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉండగా, నాలుగో రోజు తర్వాత ఈదురుగాళ్ల ఉధృతి పెరిగి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గదని ఐఎండీ స్పష్టం చేసింది. రాబోయే ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా క్యూములో నింబస్ (Cumulonimbus) మేఘాల ప్రభావం ఉన్న చోట వాతావరణంలో వేగంగా మార్పులు వస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana : ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా.. ఈ బెనిఫిట్ ఎవరికి వస్తుందంటే..?
ఇవి విస్తారంగా కురిసే వర్షాలు కానప్పటికీ, ఈదురుగాలుల వల్ల మామిడి వంటి పంటలకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి రైతులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రజలు.. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎత్తైన చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. ఈ వర్షాలు సాధారణంగా గంట లేదా రెండు గంటల పాటు మాత్రమే ఉండి తర్వాత తగ్గుతాయని తెలిపారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ మిశ్రమ వాతావరణం మరో ఐదు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!