రహదారుల చుట్టూ రాజకీయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. తమ పోరాటం వల్లే.. ప్రభుత్వంలో చలనం వచ్చిందని అంటున్న పవన్.. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయ్యేవరకూ.. పోరాటాన్ని ఆపేది లేదని జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. ఆ దిశగా కార్యోన్ముఖులను సైతం చేసే పనిలో ఉన్నారు.
మరోవైపు.. టీడీపీ నేతలు కూడా.. ఈ విషయంపై గళం పెంచుతున్నారు. పాడైన రోడ్ల గురించి విమర్శలతో వేడి పెంచుతూ.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి కూడా.. విపక్షాలకు తగ్గట్టుగా స్పందన ఎదురవుతోంది. అవసరమైతే.. 6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే.. సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమన్న సంకేతాలను.. మంత్రి శంకర్ నారాయణ ప్రకటించారు. టెండర్లు పిలిచినట్టు చెప్పారు.
Also Read
- Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
- BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్కు హైకోర్టు ఆదేశం
ఇదంతూ చూస్తుంటే.. రహదారుల చుట్టూ రాజకీయ వానలు ముసురుకుంటున్నట్టే కనిపిస్తోంది. దీనిపై స్పందిస్తున్న జనం.. విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా.. తమకు కాస్త మెరుగైన దారి చూపించండి అంటూ వేడుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణాలు చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. గతుకుల మార్గాల్లో.. కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా.. ఒళ్లు హూనమైపోతోందంటూ.. వాస్తవాలను కళ్లముందుంచుతున్నారు. ఈ నేపథ్యంలో.. అధికార, విపక్ష నేతల రహదారి రాజకీయాలు ఎలా ఉన్నా.. సమస్య పరిష్కారమైతే చాలు అని సాధార ప్రజానీకం కోరుకుంటోంది.
తాజావార్తలు
-
Rs1 Lakh Credit: ప్రభుత్వం కొత్త పథకం.. కోటి మంది మహిళలకు రూ.1 లక్ష..!
-
Minister Anagani Satyaprasad: రెవెన్యూ సమస్యలకు చెక్.. ప్రీహోల్డ్, 22ఏ భూములపై కీలక ప్రకటన
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
ట్రెండింగ్
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!