Paddy Procurement : రైతులకు శుభవార్త.. నవంబర్ 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు
- నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రారంభం
- రైతులు వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి స్పష్టం
- 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం.. సమగ్ర ఏర్పాట్లు పూర్తి
- 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి చెల్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు నవంబర్ 3 నుంచి ప్రారంభం కానుందని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి వాట్సాప్ నంబర్ 7337359375 కు “HI” అనే సందేశం పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మంత్రి వివరించారు. 2025–26 ఖరీఫ్ పంట సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో పాల్గొనడానికి 10,700 మంది సిబ్బందిని సిద్ధం చేశామని చెప్పారు.
“రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 నుంచి 48 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ అవుతుంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే నాణ్యమైన గోతాలు సిద్ధం చేసుకోవాలి. తేమ శాతం నిర్ధారించే యంత్రాలు, రవాణా సదుపాయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి,” అని అధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచనలు జారీ చేశారు. రైతుల సౌలభ్యం కోసం సమగ్ర ఏర్పాట్లు చేయాలని, అన్ని జిల్లాల్లో సేకరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని ఆయన ఆదేశించారు. ఈ నెల నవంబర్ 3న తాడేపల్లిగూడెం మండలంలోని ఆరుగొలను గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి స్వయంగా ప్రారంభించనున్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడడం, ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Also Read
Amazon layoffs: అమెజాన్ ఉద్యోగులకు నిద్రలేని రాత్రులు.. అందరిలో “లేఆఫ్” భయం..
తాజావార్తలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
-
Keeway Hypvolt-R: భారత్లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!