Minister Karumuri Nageswara Rao: అమరావతి భూమి భారీ నిర్మాణాలకు అనువైంది కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.. ఈ సారి మూడు రాజధానుల బిల్లు శాసనసభ ముందుకు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. అమరావతి రైతుల మహా పాదయాత్ర రెండో విడత ప్రారంభమైంది.. ఈ నేపథ్యంలో.. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, ల్యాండ్ ఫూలింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఐఏఎస్ చెరుకూరి శ్రీధర్ సహా ఎవ్వరు తప్పు చేసినా వదిలేది లేదని స్పష్టం చేశారు.. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయి.. ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేశారని.. మరిన్ని నిజాలు.. త్వరలో వెలుగులోకి వస్తాయన్నారు..
Read Also: PVN Madhav: మూడు రాజధానులపై బీజేపీ వైఖరి అదే.. స్పష్టంగా చెబుతున్నాం..
Also Read
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ఇక, మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ నిర్ణయం అన్నారు మంత్రి నాగేశ్వరరావు.. అమరావతి ప్రాంతంలో భారీ నిర్మాణాలకు భూమి అనువైంది కాదన్న ఆయన.. అమరావతి అభివృద్ధికి నాలుగు లక్షల కోట్లు అవసరం.. అమరావతిలోనే నాలుగు లక్షలు కోట్లు పెడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ విషయంలో చేసిన తప్పు.. మళ్లీ జరగకూడదనే మా అభిమతం అన్నారు.. మరోవైపు.. అమరావతి పాదయాత్ర కాదిది చంద్రబాబు అండ్ కో చేస్తున్న యాత్రగా ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి.. ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళన నూటికి నూరు శాతం రైతుల ఆందోళనే… కానీ, అమరావతి రైతుల పేరుతో చేసే యాత్రలో రైతులే లేరని ఎద్దేవా చేశారు.. రిస్ట్ వాచీలు.. బౌన్సర్లతో పాదయాత్ర చేసే వారిని పాదయాత్ర అంటారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కార్మూరి నాగేశ్వరరావు.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..