Teachers Face Recognition App: ఫేస్ యాప్ అటెండెన్స్పై గందరగోళం.. రంగంలోకి మంత్రి బొత్స..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా టీచర్ల అటెండెన్స్ కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇప్పుడు గందరగోళం సృష్టిస్తోంది.. హాట్ టాపిక్గా మారిన ఈ యాప్ గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. టీచర్లు స్కూళ్లకు రాగానే ముందుగా చేయాల్సిన పని ఫొటో దిగడం.. పాఠశాలల్లో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం.. అయితే, ఆ యాప్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీచర్లకు కోపం తెప్పిస్తోంది. ఇప్పటివరకు వినియోగంలో ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ స్థానంలో ఫేస్ యాప్ విధానాన్ని ప్రవేశ పెట్టడం.. టీచర్లు ఒక్క నిమిషం ఆలస్యంగా విధులకు హాజరైనా హాఫ్ డే లీవ్ గా పరిగణించేలా రూపొందించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.. అయితే, ఈ వ్యవహారంలో రంగంలోని దిగారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఉపాధ్యాయ సంఘాలతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నొరు.. ఫేస్ యాప్ ద్వారా అటెండెన్స్ విషయంలో నెలకొన్న గందరగోళం, యాప్ వద్దంటూ ఉపాధ్యాయ సంఘాల చేస్తున్న ఆందోళనపై చర్చించనున్నారు.. మూడు గంటలకు మంత్రి బొత్స, విద్యాశాఖ అధికారులతో సమావేశం కానున్నాయి ఉపాధ్యాయ సంఘాలు.
Read Also: Munugodu TRS : మునుగోడులో చేరికలు ఊపందుకున్నాయా..?
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
మరోవైపు, మూడో రోజు ఉపాధ్యాయ సంఘాలో ఆందోళనకు కొనసాగిస్తున్నాయి.. అటెండెన్స్ యాప్ ను పూర్తిగా తొలగించాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయులపై యాప్ ల భారం అధికమైందని..మంత్రి బొత్స తో చర్చలు విఫలం అయితే ఉద్యమం మరింతా ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరగబడుతున్నరు కాబట్టే మాపై ఈ కక్ష్య పూరిత ఆలోచన అని ఆరోపిస్తున్నారు. అటెండెన్స్ యాప్ నిర్ణయం పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫేస్ యాప్ పై విద్యశాఖ అధికారులు, మంత్రి బొత్స తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది యూటీఎఫ్.. సొంత ఫోన్లో ఉపాధ్యాయులు హాజరు వేయరు.. హాజరు వేయడానికి కొత్త డివైజ్ లు ఇవ్వాలని.. 9 దాటితే సెలవంటూ షోకాజ్ నోటీసులు ఇస్తాం అంటూ బెదిరిస్తున్నారు… ఇప్పటికే 14కు పైగా యాప్స్ ఉన్నాయి… యాప్స్ కాకుండా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పెంచాలని.. యాప్స్ పేరుతో ఉపాధ్యాయులను వేధించటం సరైంది కాదంటున్నారు యూటీఎఫ్ నేతలు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!