Munugodu TRS : మునుగోడులో చేరికలు ఊపందుకున్నాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugodu TRS : ఉపఎన్నిక బ్యాక్డ్రాప్లో మునుగోడులో చేరికలు ఊపందుకున్నాయి. ఆయారాం గయారామ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. జాయినింగ్స్తో బలపడుతున్నట్టు భావిస్తున్నా.. అధికారపార్టీలో కొత్త రాగం అందుకుంటున్నారు లోకల్ లీడర్స్..! ప్రాధాన్యం దక్కడం లేదని రుసరుసలాడుతున్నారట.
అన్ని పార్టీల దృష్టీ మునుగోడుపైనే ఉంది. జంపింగ్లు జోరందుకున్నాయి. మునుగోడులో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇవాళ ఒక పార్టీ శిబిరంలో కనిపించిన లోకల్ లీడర్స్.. తెల్లారేసరికి కండువా మార్చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే.. టైమ్ అలాంటిది అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కంటే ముందే పార్టీల అలజడి వేడి పుట్టిస్తోంది. దానికి ఆపరేషన్ ఆకర్ష్ మరింత జోష్ ఇస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్సహా వివిధ పార్టీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారడానికి పెద్దగా సంకోచించడం లేదు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంలో టీఆర్ఎస్ కాస్త స్పీడ్గా ఉంది. కాకపోతే ఈ వేగమే అధికారపార్టీకి స్థానికంగా కొన్ని చిక్కులు తెచ్చిపెడుతోందట.
Also Read
ఇతర పార్టీల నుంచి చేరుతున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని.. వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారని.. మునుగోడులో మొదటి నుంచి TRSలో ఉన్న నేతలు కినుక వహిస్తున్నారట. అన్నీ వాళ్లకేనా.. మాకేం లేదా అని ముఖం మీదే అడిగే పరిస్థితి ఉందట. దీనిపై ఒక్కొక్కరూ ఒక్కే విధంగా కామెంట్స్ చేస్తున్నారట. కొత్తగా చేరిన వారికి పార్టీ అది ఇచ్చింది.. ఈ పనిచేసింది.. భవిష్యత్కూ భరోసా ఇచ్చింది అని స్థానిక నేతలు ఆవేదన చెందుతున్నారట. అసంతృప్తితో లోలోన రగిలిపోతున్నారట. ముఖ్యంగా టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చాలా గుర్రుగా ఉన్నారట. తమను పార్టీ పెద్దలు లైట్ తీసుకుంటున్నారని మథన పడుతున్నారట. ఈ విషయం ఆ నోటా ఈ నోటా టీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లకపోతుందా? గుర్తించి ప్రాధాన్యం ఇవ్వకపోతారా అని కొందరు ఎదురు చూస్తున్నారట.
కొందరు పార్టీ ప్రజాప్రతినిధులైతే తమ దగ్గరకొచ్చిన పార్టీ పెద్దలను ముఖంమీదే నిలదీస్తున్నారట. ఫలానా పార్టీ నుంచి ఆఫర్ ఉంది. అరకోటి ఇస్తామని చెబుతున్నారు? మీ సంగతేంటి.. మాకేం చేస్తారు అని ప్రశ్నిస్తున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంతా చూస్తున్నట్టు కేడర్ మాట. ఉప ఎన్నిక రాకపోతే ఇతర పార్టీ వాళ్లను పట్టించుకుంటారా? ఇప్పుడు గళం ఎత్తకపోతే మనల్ని పక్కన పెట్టేస్తారు అని అనుచరులతో జరిగే సమావేశాల్లో చర్చిస్తున్నారట. చాలా మంది మేరా నెంబర్ కబ్ ఆయేగా అని ఎదురు చూస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదో ఒక హామీ వస్తే మనసు కుదుట పడుతుందని.. లేకపోతే ఆందోళనతో పిచ్చెక్కి పోతోందని వాపోతున్నారట. మరి.. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు అధికారపార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!