టీడీపీ, బాబు పనైపోయింది.. అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తే నేనూ రెడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చితికిలపడిపోయింది.. ఇక, ఈ ఎన్నికలతో టీడీపీ పని అయిపోయిందంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎన్నికల ఫలితాలు లెక్కించాలని తీర్పు ఇచ్చిన రోజు నుంచి టీడీపీలో ఆక్రోశం, ఆందోళన మొదలైందని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రజలు సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని ఎన్నికల ఫలితాలతో నిరూపితమైందనన్నారు.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు పనైపోయింది.. టీడీపీకి ప్రజల్లో మనుగడ లేదన్నారు. టీడీపీ విలువలు కాపాడు కోవాల్సిన పరిస్థితి ఉందన్న బొత్స… ఎన్నికల ఫలితాలతో ఇప్పటికైనా టీడీపీ బుద్ది తెచ్చుకోవాలని హితవుపలికారు.. ఎన్నికలు బహిష్కరణ అంటే నామినేషన్లకు ముందే ఆ విషయాన్ని తెలియజేయాలి.. కానీ, నామినేషన్లు వేశాక చేతకాక ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్పారంటూ ఎద్దేవా చేశారు బొత్స సత్యనారాయణ.
ప్రజలిచ్చిన తీర్పు స్ఫూర్తితో ప్రజల సేవకు సీఎం జగన్ పునరంకితమవుతారు అని ప్రకటించారు మంత్రి బొత్స.. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా సీఎం జగన్ అమలు చేస్తారన్న ఆయన.. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేయడం సరైంది కాదన్నారు.. అయితే, అచ్చెన్నాయుడు తన పదవికి రాజీనామా చేయమనండి.. నేనూ రాజీనామా చేస్తాను.. ఇద్దరూ రాజీనామా చేసి పోటీ చేసి ప్రజాబలం ఏమిటో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.. స్థాయిని తగ్గించేలా టీడీపీ నేతలు మాటలు మట్లాడవద్దన్న ఆయన.. టీడీపీ నేతలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబు నాయుడిని చంపడానికి, కొట్టడానికే ఆయన ఇంటికి వైసీపీ నేతలు వెళ్లారనడం సరికాదన్నారు. ఇక, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్లకు శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపిన మంత్రి బొత్స.. రాష్ట్రంలో 60 లక్షల మందికి ఇంటిపై శాశ్వత హక్కు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని.. దీనికోసం విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారని.. డిసెంబర్ లోపు 80వేల టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందిస్తామని వెల్లడించారు.
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!