Team India Photoshoot: వన్డే సిరీస్కు ముందు టీమిండియా సరదా ఫోటో షూట్! వీడియో చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Photoshoot: రాంచీలో నవంబర్ 30న టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ఒక ఫోటోషూట్లో పాల్గొంది. ఈ వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో క్రికెట్ ప్రేమికులు మస్తు ఖుషీ అవుతున్నారు. వీడియోలో రిషబ్ పంత్, అర్ష్దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొదలైన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వీడియోలో రిషబ్ పంత్తో ఫోటోగ్రాఫర్ మామూలు కామెడీ చేయలేదు. ఫోటో తీసే టైంలో పంత్ సరిగ్గా నవ్వలేకపోవడంతో, ఫోటోగ్రాఫర్ పంత్ను కొంచెం నవ్వమని అడిగాడు, దానికి ఈ స్టార్ ప్లేయర్ సూపర్ సమాధానం ఇచ్చాడు.
READ ALSO: Pakistan: పాకిస్తాన్కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఇతర టీమిండియా ఆటగాళ్ల మాదిరిగానే పంత్ కూడా ఫోటోషూట్ కోసం వచ్చాడు. అయితే ఫోటోగ్రాఫర్ పంత్వి కొన్ని ఫోటోలు తీశాడు, తర్వాత ఆయన పంత్ను కొంచెం నవ్వమని అడిగాడు. దీంతో పంత్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నిద్రపోయానని, ఇంతకు ముందే మేల్కొన్నానని బదులిచ్చాడు. ఫోటో తీస్తుండగా పంత్ కళ్లలో నిద్ర కనిపించిందని పలువురు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన ఫోటోను ప్రొఫెషనల్ పద్ధతిలో తీయించుకోగా, రోహిత్ శర్మ ఫోటోగ్రాఫర్కు ముందుగా ఏ యాంగిల్ తీయాలో సూచించాడు.
ఇదంతా పక్కన పెడితే టీమిండియాకు వన్డే సిరీస్ గెలవడం చాలా కీలకం. దక్షిణాఫ్రికా చేతిలో ఇప్పటికే టెస్ట్ సిరీస్ను భారత జట్టు కోల్పోయింది. 0-2 తేడాతో క్లీన్ స్వీప్ తర్వాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు, ఇదే సమయంలో ఆయనను పదవి నుంచి తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు టీమిండియా వన్డే ఫార్మాట్లో బాగా రాణించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సిరీస్ను భారత్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై కూడా అదే జరిగితే, కోచ్ నుంచి మొత్తం టీం వరకు అందరిపై నిస్సందేహంగా ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాన్ ఏఫెక్ట్..
Lights 💡
Camera 📸
Action 🎬A fun BTS sneak peek as #TeamIndia gets ready for the #INDvSA ODI series opener in Ranchi 🥳@IDFCFIRSTBank pic.twitter.com/JK2IdsxnJ8
— BCCI (@BCCI) November 29, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!