Team India Photoshoot: వన్డే సిరీస్కు ముందు టీమిండియా సరదా ఫోటో షూట్! వీడియో చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Photoshoot: రాంచీలో నవంబర్ 30న టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ఒక ఫోటోషూట్లో పాల్గొంది. ఈ వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో క్రికెట్ ప్రేమికులు మస్తు ఖుషీ అవుతున్నారు. వీడియోలో రిషబ్ పంత్, అర్ష్దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొదలైన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వీడియోలో రిషబ్ పంత్తో ఫోటోగ్రాఫర్ మామూలు కామెడీ చేయలేదు. ఫోటో తీసే టైంలో పంత్ సరిగ్గా నవ్వలేకపోవడంతో, ఫోటోగ్రాఫర్ పంత్ను కొంచెం నవ్వమని అడిగాడు, దానికి ఈ స్టార్ ప్లేయర్ సూపర్ సమాధానం ఇచ్చాడు.
READ ALSO: Pakistan: పాకిస్తాన్కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..
Also Read
- IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
ఇతర టీమిండియా ఆటగాళ్ల మాదిరిగానే పంత్ కూడా ఫోటోషూట్ కోసం వచ్చాడు. అయితే ఫోటోగ్రాఫర్ పంత్వి కొన్ని ఫోటోలు తీశాడు, తర్వాత ఆయన పంత్ను కొంచెం నవ్వమని అడిగాడు. దీంతో పంత్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నిద్రపోయానని, ఇంతకు ముందే మేల్కొన్నానని బదులిచ్చాడు. ఫోటో తీస్తుండగా పంత్ కళ్లలో నిద్ర కనిపించిందని పలువురు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన ఫోటోను ప్రొఫెషనల్ పద్ధతిలో తీయించుకోగా, రోహిత్ శర్మ ఫోటోగ్రాఫర్కు ముందుగా ఏ యాంగిల్ తీయాలో సూచించాడు.
ఇదంతా పక్కన పెడితే టీమిండియాకు వన్డే సిరీస్ గెలవడం చాలా కీలకం. దక్షిణాఫ్రికా చేతిలో ఇప్పటికే టెస్ట్ సిరీస్ను భారత జట్టు కోల్పోయింది. 0-2 తేడాతో క్లీన్ స్వీప్ తర్వాత, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విమర్శలను ఎదుర్కొంటున్నాడు, ఇదే సమయంలో ఆయనను పదవి నుంచి తొలగించాలనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు టీమిండియా వన్డే ఫార్మాట్లో బాగా రాణించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి సిరీస్ను భారత్ కోల్పోయింది. దక్షిణాఫ్రికాపై కూడా అదే జరిగితే, కోచ్ నుంచి మొత్తం టీం వరకు అందరిపై నిస్సందేహంగా ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Ditva Cyclone: తమిళనాడుకు దిత్వా తుఫాన్ ఏఫెక్ట్..
Lights 💡
Camera 📸
Action 🎬A fun BTS sneak peek as #TeamIndia gets ready for the #INDvSA ODI series opener in Ranchi 🥳@IDFCFIRSTBank pic.twitter.com/JK2IdsxnJ8
— BCCI (@BCCI) November 29, 2025
తాజావార్తలు
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
-
Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
-
Double-Stack Container Train: భారతీయ రైల్వే చరిత్రలో కీలక మైలురాయి.. తొలిసారి డబుల్ స్టాక్ లాంగ్-హాల్ కంటైనర్ రైలు
-
IND vs SL 2nd Test: క్లీన్ స్వీప్పై భారత్ కన్ను.. శ్రీలంకకు మళ్లీ గాయాల దెబ్బ..
-
Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!