AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎంపీ మిథున్ రెడ్డి విడుదల.. ఆ ముగ్గురికి బెయిల్!
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం..
- ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్..
- రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డి..
- ఈ నెల 11న సరెండర్ కావాలని మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశం..
- ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు మిథున్రెడ్డికి అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ31గా ధనుంజయ్ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33గా ఉన్న బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురి పాస్పోర్ట్లను కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Bowel Cancer: షాకింగ్ అధ్యయనం.. మాంసం, మద్యం తాగే యువతకు పెద్దపేగు క్యాన్సర్..!
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఇక, లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని సెట్ అధికారులు జూలై 20న అరెస్ట్ చేయగా.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదిగా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు మిథున్ రెడ్డి వేసిన రెగ్యులర్ బెయిల్ ను కోర్టు తిరస్కరించింది. అయితే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కు న్యాయస్థానం అంగీకరించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి ఓటు వేసేందుకు అనుమతి దొరికింది. అలాగే, ఈనెల 11వ తేదీన తిరిగి కోర్టులో సరెండర్ కావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Viral: పాకిస్థాన్ లో ఘనంగా వినాయక నిమజ్జనం
కాగా, జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పలువురు పార్టీ నేతలు, శ్రేణులు కలిసి పరామర్శించారు. ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తున్నట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!