Home Minister Taneti Vanitha: ఏపీలోనే అత్యధికంగా డ్రగ్స్ స్వాధీనం.. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సాగుతున్న స్మగ్లింగ్లో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అంటున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమర్థతే దీనికి కారణమని, పోలీసు యంత్రాంగం మెరుగైన పనితీరు ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, మత్తు పదార్థాలు రవాణాను ఆరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన హోంశాఖ మంత్రి తానేటి వనిత… రాష్ట్రంలో గంజాయి రవాణాశాఖ ఆరికట్టడానికి మా సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.. గంజాయి సాగే జీవనాధరంగా జీవిస్తున్న గిరిజనల్లో అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు..
Read Also: Kakani Govardhan Reddy: బాబు చేసిన పాపాలు రైతులకు శాపాలుగా మారాయి.. దమ్ముంటే చర్చకు రావాలి
Also Read
కాగా, దేశంలో 2021-22 సంవత్సరంలో డ్రగ్స్ని అత్యధిక స్థాయిలో ఆంధ్రలోనే స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం విదితమే.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా’ పేరుతో తయారుచేసిన నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం హస్తినలో విడుదల చేశారు.. ఆ నివేదిక ప్రకారం సీఆర్పీఎఫ్ 2021-22 సంవత్సరంలో అత్యధికంగా ఏపీలో 18,267.84 కిలోలు, ఆ తర్వాత త్రిపురలో 10,104.99 కిలోలు, అస్సోంలో 3,633.08 కిలోలు, తెలంగాణలో 1,012.04 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది.. ఇక, బ్రౌన్ షుగర్, హెరాయిన్, ఓపియం, మార్ఫిన్, గంజాయి వంటివి ఇందులో ఉన్నాయి.. డీఆర్ఐ నేతృత్వంలో ఏపీలో 1,057 కిలోల గంజాయి, హైదరాబాద్లో 3.2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!