Cm Jagan: రూ.1000 కోట్ల రుణం కోసం ఏపీ సర్కార్ ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం మరోసారి రుణం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విడత రూ.1,000 కోట్లు రుణం తీసుకోవాలని భావిస్తోంది. 13వ తేదీన ఆర్ బీఐ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొననుంది సర్కారు. ఈవిషయంపై ఆర్ బీఐకి సమాచారం కూడా ఇచ్చిందని తెలుస్తోంది. వివిధ సంక్షేమ పథకాలకు డబ్బులు కోసం ఏపీ ప్రభుత్వం చేయని ప్రయత్నాలు లేవు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లోనే సర్కారు భారీగా రుణాలను సమీకరించింది ప్రభుత్వం.
మరో విడత రూ.1,000 కోట్ల కోసం ఈ నెల 13న ఆర్ బీఐ నిర్వహించే వేలంలో పాల్గొంటామంటూ అధికారికంగా సమాచారం ఇచ్చింది.ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో అంటే ఆగస్ట్ నాటికి రూ.48వేల కోట్లకు పైగా రుణాలు సమీకరించింది. ఆర్ బీఐ వేలంలో పాల్గొని రూ.1,000 కోట్ల రుణం పొందితే, అది రూ.49,100 కోట్లకు చేరుతుంది. ఇక ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల రూపంలో తీసుకున్న రుణాలు వీటికి అదనం.
Also Read
- Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!
- Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
ఇదిలా వుంటే.. మరికొన్ని సంక్షేమపథకాలకు జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అక్టోబరు 1 నుంచి వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జీవో కూడా జారీ అయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు వర్తించనుంది. పేద ఆడపిల్ల కుటుంబాలకు సర్కారు బాసటగా నిలవనుంది. వివాహం జరిపించేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. ఎస్సీలకు వైయస్సార్ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు అందించనుంది.
Read Also: Danam Nagender: సీఎం కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే నందుబిలాల్ నిరసన చేయడం తప్పా?
ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు,ఎస్టీలకు రూ. 1 లక్ష అందించనుంది. ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు ఇవ్వనుంంది. బీసీలకు రూ. 50వేలు, బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు ఇవ్వనుంంది. మైనార్టీలకు రూ. 1 లక్ష, వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు, భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు జగన్ ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం ద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేశామంటున్నారు జగన్. ఈ పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహించనున్నారు. ఈ పథకానికి కూడా భారీగా నిధులు కావాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం 1000కోట్ల నిధులకు ప్రయత్నాలు చేస్తోంది.
Read Also: Danam Nagender: మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు..!
తాజావార్తలు
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
-
Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
-
Credit Card Tips: క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 ఛార్జీలపై ఒక లుక్కేయండి.. లేదంటే అప్పుల పాలవుతారు!
-
Riyan Parag: ప్లే ఆఫ్స్ చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రియాన్ పరాగ్.. ‘అతడు లేకపోతే ఇంటికి వెళ్లేవాళ్లం’..
-
RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!