Meruga Nagarjuna: పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో మంత్రులు టీడీపీని టార్గెట్ చేశారు. మానిఫెస్టోని మేము బైబిల్, ఖురాన్, భగవద్గీతగా చూస్తాం.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ మ్యానిఫెస్టోని అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. ఇప్పటి వరకు 98శాతం హామీలు అమలు చేశాం. తాజాగా కళ్యాణమస్తు, పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చాం. దీని వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపయోగం వుంటుంది. ఏ ఇంటికి వెళ్లినా జగన్ వల్ల మాకు ఎంతో ప్రయోజనం అని చెబుతున్నారు. చంద్రబాబు లాగా మేము మ్యానిఫెస్టోని ఎగ్గొట్టాలని చూడడం లేదన్నారు.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
అక్టోబర్ ఒకటి నుండి కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫాలను అమలు చేస్తాం. ఎస్సీల్లో కులాంతర వివాహం చేసుకునే వారికి లక్షా ఇరవై వేలు ఇవ్వబోతున్నాం . ఎస్టీలకు కూడా లక్ష ఇరవై రూపాయలు ఇవ్వబోతున్నాం. బీసీలకు 35 చంద్రబాబు ఇస్తే మేము 50 వేలు ఇస్తున్నాం. వికలాంగులకు లక్షా 50 వేలు ఇస్తున్నాం. జగన్ కు ఈ అణగారిన కుటుంబాల కోసం ఎంతగా పథకాలు అమలు చేస్తున్నాం. చంద్రబాబుకు, జగన్ కి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు మంత్రి నాగార్జున. చంద్రబాబు పథకాలను ఎగ్గొట్టేవాడు.. మేము అందరికీ ఇవ్వాలని తాపత్రయం పడతాం అన్నారు.
పదవులు పంపిణీ దగ్గర నుండి పథకాల అమలు వరకు బడుగులకు ఎంతో చేస్తున్నారు జగన్. ఈ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు బూతులు తిడుతున్నాడు. రాజకీయంగా చంద్రబాబు దిగజారి పోయాడు. చంద్రబాబు చేసే కుయుక్తులు, మోసాలు, కుట్రలను అన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు. దుష్టచతుష్టయాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రెచ్చిపోతున్నాడు. దళితుల మీద దాడులు, వారికి అందే సంక్షేమ పథకాలపై మేము చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు మంత్రి నాగార్జున. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్న వ్యక్తి జగన్ అన్నారు.
ఎస్సీల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా అన్న వ్యక్తి చంద్రబాబు. ఎస్సీలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి. అలాంటి చంద్రబాబు దళితుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అన్న క్యాంటీన్లు మేము అడ్డుకోవడం లేదు. అసలు అన్న ఎక్కడున్నాడు? క్యాంటీన్లు ఎక్కడ పెడుతున్నారు? అమరావతిలో రైతులు ఉన్నారా? దళితులు, బీసీలు ఉన్నారా? మరి ఎవరు పాదయాత్ర చేస్తున్నారో జనానికి తెలుసునన్నారు మంత్రి నాగార్జున.
Read Also: Nandamuri Balakrishna: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసింది
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!