Bandi Srinivas : పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదును విత్ డ్రా పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన డీఏ ఎరియర్స్ క్రెడిట్ అయిన విషయంలో గందరగోళం ఏర్పడింది. బిల్లులు పాస్ చేయకుండానే క్రెడిట్ డబ్బులు అయ్యాయి. ఉద్యోగులకు సంబంధం లేకుండానే డబ్బులు విత్డ్రా అవ్వడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆందోళనను ఆర్ధిక శాఖ అధికారుల దృష్టికి ఎన్జీవో అసోసియేషన్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు విత్ డ్రా అవటం పై ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అంశాన్ని ఆర్ధికశాఖ స్పెషల్ సీఎస్ రావత్, సత్యనారాయణలను కలిసి వివరించామని, పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారన్నారు.
సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉంటుందని తెలిపినట్లు, ఈ సాయంత్రం ఐదు గంటల వరకు ఏం జరిగిందో స్పష్టత ఇస్తామన్నారని వారు పేర్కొన్నారు. కింది స్థాయి అధికారుల నుండి నివేదిక తెప్పిస్తామని భరోసా ఇచ్చారని వెల్లడించారు. సీఎఫ్ఎమ్ఎస్ విధానం వల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, సీఎఫ్ఎమ్ఎస్ వ్యవస్థను రద్దు చేసి పాత ట్రెజరీ విధానాన్నే తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశామన్నారు. సంబంధిత అధికారులు బిల్లులు పాస్ చేయకుండానే కొంత మంది ఉద్యోగులకు డబ్బులు క్రెడిట్ అయినట్లు గమనించారన్నారు. 1-7-2018, 1-1-2019 డీఏ ఎరియర్స్ వేశామని అంటున్నారు అవి క్రెడిట్ కాలేదని చెప్పామన్నారు.
Also Read
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
- AP Cabinet Meeting: అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం.. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!