ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి… విశాఖలో ఏపీ ఎడ్ సెట్ ఫలితాలను విడుదల చేశారు కన్వీనర్ విశ్వేశ్వర్ రావు… ఈ ఏడాది ఎడ్ సెట్కు 15638 మంది దరఖాస్తు చేసుకోగా… అందులో 13,619 మంది పరీక్షకు హాజరయ్యారు.. ఇక, ఫలితాల్లో 13,428 మంది అంటే.. 98.60 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు ఎడ్సెట్ కన్వీనర్ విశ్వేశ్వర్రావు వెల్లడించారు.. ఇక, కిందటేడాది డాటా ప్రకారం అందుబాటులో ఉన్న సీట్లు 42 వేలు కాగా… కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనుంది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి.