Komatireddy Rajagopal Reddy: బీజేపీ తరపున మరో ‘ఆర్’ గెలవడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Rajagopal Reddy: రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్న ఆయన.. బీజేపీ తరపున మరో “ఆర్” గెలవడం ఖాయమని.. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఫామ్ హౌజ్ నుంచి బయటకు రాని కేసీఆర్.. బయటకు వచ్చి మునుగోడులో సభ పెట్టిండు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ అంటే.. టీఆర్ఎస్ లాగా లక్షల కోట్లు దోచుకున్న పార్టీ కాదని ఆయన ఆరోపించారు. మునుగోడు ఎన్నికలపై కేసీఆర్కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ అటో.. ఇటో.. అభ్యర్థి పేరును ప్రకటించినా.. అదే కేసీఆర్ కు కనీసం అభ్యర్థి కూడా దొరకడం లేదని… అందుకే పేరు ప్రకటించడం లేదన్నారు. కేసీఆర్ సభలు జనం లేక వెలవెలబోతున్నాయన్నారు. కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చిన ఉప ఎన్నిక కాదన్న ఆయన.. ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్ కోసం వచ్చిన ఉప ఎన్నిక అని చెప్పుకొచ్చారు. మచ్చలేని నాయకుడు మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో జరిగేది ఎన్నిక కాదని.. అది ఒక ధర్మ యుద్ధమన్నారు.
Also Read
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
Etela Rajender: కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువే..
మునుగోడు ఉప ఎన్నికలో ధర్మాన్ని కాపాడి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలన్నారు. కేసీఆర్కు భయంతో నిద్ర పట్టడం లేదన్నారు. బండి సంజయ్ పాదయాత్రగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
-
Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
-
YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?