రెండు రోజులు ఢిల్లీలోనే మకాం.. ఏపీ సీఎం పర్యటనకు ప్రాధాన్యత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని కోరనున్నారు. విభజన హామీలు, పెండింగ్ బకాయిల తదితర అంశాలపైనా హోమ్ మంత్రితో చర్చించనున్నారు జగన్. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ సహా ఇతర విషయాలపైనా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్, గజేంద్ర సింగ్ షెకావత్ లతో కూడా భేటీ కానున్నారు ఏపీ సీఎం.. పోలవరం ప్రాజెక్టు కు నిధులు, నిర్మాణం కొనసాగుతున్న తీరుతెన్నుల పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించనున్న ఆయన.. కేంద్ర పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తో పెండింగ్ లో ఉన్న పలు అంశాల పై చర్చిస్తారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకానికి సహకారం అందించాలంటూ.. 2 రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం జగన్. కేంద్ర పథకం-ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో కలిపి.. రాష్ట్ర వ్యాప్తంగా 17వేలకు పైగా గ్రీన్ ఫీల్డ్ కాలనీలను అభివృద్ధి చేస్తుండగా… మౌలిక సదుపాయాల కోసం ఆర్ధిక సహకారం అందించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అమిత్ షాతో జగన్ భేటీ సమయంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. షాతో పాటు పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. అటు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఇక, రేపు రాత్రికి హస్తినలోనే బస చేయనున్నారు.. ఎల్లుండి ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.
Also Read
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్కు లేఖ వెనుక అసలు కథ.!
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!