రెండు రోజులు ఢిల్లీలోనే మకాం.. ఏపీ సీఎం పర్యటనకు ప్రాధాన్యత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని కోరనున్నారు. విభజన హామీలు, పెండింగ్ బకాయిల తదితర అంశాలపైనా హోమ్ మంత్రితో చర్చించనున్నారు జగన్. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ సహా ఇతర విషయాలపైనా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్, గజేంద్ర సింగ్ షెకావత్ లతో కూడా భేటీ కానున్నారు ఏపీ సీఎం.. పోలవరం ప్రాజెక్టు కు నిధులు, నిర్మాణం కొనసాగుతున్న తీరుతెన్నుల పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించనున్న ఆయన.. కేంద్ర పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తో పెండింగ్ లో ఉన్న పలు అంశాల పై చర్చిస్తారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకానికి సహకారం అందించాలంటూ.. 2 రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం జగన్. కేంద్ర పథకం-ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో కలిపి.. రాష్ట్ర వ్యాప్తంగా 17వేలకు పైగా గ్రీన్ ఫీల్డ్ కాలనీలను అభివృద్ధి చేస్తుండగా… మౌలిక సదుపాయాల కోసం ఆర్ధిక సహకారం అందించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అమిత్ షాతో జగన్ భేటీ సమయంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. షాతో పాటు పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. అటు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఇక, రేపు రాత్రికి హస్తినలోనే బస చేయనున్నారు.. ఎల్లుండి ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
- OTR: విశాఖ మేయర్ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?
తాజావార్తలు
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
-
Hanuman Ansh Singer: ఒక్క పాటతో అంధ గాయకుడి లైఫ్ టర్న్.. బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు..
-
Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
-
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
-
Dengue Insurance Claim: ‘డెంగ్యూ సీరియస్ కాదట’.. ప్లేట్లెట్స్ 70 వేల కంటే తగ్గలేదంటూ మెడిక్లెయిమ్ రిజెక్ట్?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!