రెండు రోజులు ఢిల్లీలోనే మకాం.. ఏపీ సీఎం పర్యటనకు ప్రాధాన్యత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని కోరనున్నారు. విభజన హామీలు, పెండింగ్ బకాయిల తదితర అంశాలపైనా హోమ్ మంత్రితో చర్చించనున్నారు జగన్. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ సహా ఇతర విషయాలపైనా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్, గజేంద్ర సింగ్ షెకావత్ లతో కూడా భేటీ కానున్నారు ఏపీ సీఎం.. పోలవరం ప్రాజెక్టు కు నిధులు, నిర్మాణం కొనసాగుతున్న తీరుతెన్నుల పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించనున్న ఆయన.. కేంద్ర పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తో పెండింగ్ లో ఉన్న పలు అంశాల పై చర్చిస్తారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకానికి సహకారం అందించాలంటూ.. 2 రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం జగన్. కేంద్ర పథకం-ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో కలిపి.. రాష్ట్ర వ్యాప్తంగా 17వేలకు పైగా గ్రీన్ ఫీల్డ్ కాలనీలను అభివృద్ధి చేస్తుండగా… మౌలిక సదుపాయాల కోసం ఆర్ధిక సహకారం అందించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అమిత్ షాతో జగన్ భేటీ సమయంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. షాతో పాటు పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. అటు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఇక, రేపు రాత్రికి హస్తినలోనే బస చేయనున్నారు.. ఎల్లుండి ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!