CM Jagan: టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్.. పాసైన వారికీ బెటర్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యాశాఖపై తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా పదో తరగతి ఫలితాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువ రావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నారు. నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెలలోజుల్లోనే మళ్ళీ పరీక్షలు పెట్టి వారిని కూడా రెగ్యులర్గానే పరిగణిస్తామని పేర్కొన్నారు. పదో తరగతిలో పాసైన వారికి కూడా ఏదైనా రెండు సబ్జెక్టులలో బెటర్మెంట్ రాసుకోవడానికి అనుమతి ఇస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెప్పారని సీఎం జగన్ అన్నారు. 49 అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు రూ.500 ఫీజు కట్టి ఏదైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్మెంట్ పరీక్షలు రాసుకునే సౌలభ్యం కల్పించారన్నారు.
మరోవైపు ఈ నెలాఖరు నాటికి రెండో దశ నాడు-నేడు కింద అన్ని స్కూల్స్లో పనులు మొదలు కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రతి పాఠశాలలో టీవీలు ఉండాలన్నారు. బోధన, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మనం పోటీపడుతున్నామని జగన్ పేర్కొన్నారు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి విద్యా కానుక అందించాలని సూచించారు. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్ కాలేజీ లేదా హైస్కూల్ ప్లస్ లేదా కేజీబీవీ ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో రీడ్ ఎలాంగ్ యాప్ పనితీరును సీఎం జగన్కు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు సుమారు 57,828 మంది రోజూ రీడ్ ఎలాంగ్ యాప్ను వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. ఫొనిటిక్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని.. పిల్లలు పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలగాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Also Read
తాజావార్తలు
-
Rakul Preet Singh: “మోసం చేస్తే వదిలేస్తా”.. పెళ్లి తర్వాత రిలేషన్పై రకుల్ షాకింగ్ కామెంట్స్!
-
Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!