Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కొంతకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తుండగా.. ప్రొబేషన్ డిక్లరేషన్పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్ను ఖరారు చేయనున్నారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్ అమలు కానుంది. లక్షా 17 వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేలు కిందకు రానున్నారు. ఆగస్టు 1న కొత్త జీతాలు అందుకోనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు. ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై సీఎం సంతకం చేయడంతో ఉద్యోగుల నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్ష పాసయ్యారన్నారు. ఉద్యోగులు పాస్ అవ్వటం లేదన్న కారణంతో ముఖ్యమంత్రి నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని తీసేశారని పేర్కొన్నారు. సుమారు 16 వేల మంది మాత్రమే ఇప్పుడు ప్రొబేషన్ డిక్లరేషన్ కిందకు రాలేదన్నారు. పాత పేస్కేల్ ప్రకారం ఇద్దామన్న ఆర్ధిక శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి తిరస్కరించారని తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని.. ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలని సీఎం జగన్ చెప్పారన్నారు. అందుకే కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని.. రెండు నెలల లోపు అందరికీ సాధ్యమైనంత వరకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ముఖ్యమంత్రి అన్నారని.. పరీక్ష పాసైన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ అవుతుందని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
-
Tuesday Rasi Phalalu: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారంటే?
-
Samantha: సమంత బిడ్డకు పేరు పెట్టిన ఫ్యాన్.. ‘సామ్రాజ్’పై సామ్ ఆన్సర్ వైరల్!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!