Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కొంతకాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తుండగా.. ప్రొబేషన్ డిక్లరేషన్పై సీఎం జగన్ తాజాగా సంతకం చేశారు. ఈ అంశంపై ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల కానుంది. జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల ప్రొబేషన్ను ఖరారు చేయనున్నారు. జూలై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పేస్కేల్ అమలు కానుంది. లక్షా 17 వేల మంది ఉద్యోగులు కొత్త పేస్కేలు కిందకు రానున్నారు. ఆగస్టు 1న కొత్త జీతాలు అందుకోనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు. ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై సీఎం సంతకం చేయడంతో ఉద్యోగుల నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్ష పాసయ్యారన్నారు. ఉద్యోగులు పాస్ అవ్వటం లేదన్న కారణంతో ముఖ్యమంత్రి నెగెటివ్ మార్కింగ్ విధానాన్ని తీసేశారని పేర్కొన్నారు. సుమారు 16 వేల మంది మాత్రమే ఇప్పుడు ప్రొబేషన్ డిక్లరేషన్ కిందకు రాలేదన్నారు. పాత పేస్కేల్ ప్రకారం ఇద్దామన్న ఆర్ధిక శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి తిరస్కరించారని తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని.. ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలని సీఎం జగన్ చెప్పారన్నారు. అందుకే కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని.. రెండు నెలల లోపు అందరికీ సాధ్యమైనంత వరకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని ముఖ్యమంత్రి అన్నారని.. పరీక్ష పాసైన వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ అవుతుందని వెంకట్రామిరెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!