Chintakayala Vijay: చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ ఇంట్లో సీఐడీ పోలీసులు హల్చల్ చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో విజయ్ ఇంట్లో లేరు. సీఐడీ సిబ్బంది విజయ్ అడ్రస్ కోసం డ్రైవర్ ని కొట్టినట్టు చెబుతున్నారు. విజయ్ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి ఇల్లంతా సోదాలు చేశారు పోలీసులు…బెడ్రూం, కిచెన్ తో పాటు ఇంట్లో ఉన్న కప్ బోర్డులను చెక్ చేశారు పోలీసులు. విజయ్ ఇద్దరు చిన్న పిల్లలను కూడా సీఐడీ పోలీసులు వదలలేదు. తండ్రి విజయ్ ఆచూకీ చెప్పాలని పిల్లలను బెదిరించారు పోలీసులు.
చింతకాయల విజయ్ కి ఏపీ సీఐడీ 41 సీఆర్ పీసీ నోటీసులు జారీచేశారు. టీవీలో చూసి నోటీస్ ఇచ్చేందుకు వచ్చాం అని బుకాయించారు. ఇంట్లో ఉన్న సిబ్బందికి 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చారు. సీఐడీ పీఎస్ లో నమోదయిన కేసులో హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై తెలంగాణలోని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని టీడీపీ నేత చింతకాయల విజయ్ ఇంటికి AP పోలీసులు వచ్చారని, విజయ్ ఇంట్లో లేకపోవడంతో సర్వెంట్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
Read Also:Rajasthan: బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియో వైరల్ చేస్తామని డబ్బులు డిమాండ్
ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ యూత్ నేత పొగాకు జయరాం. ఏపీ పోలీసుల మంటూ దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించడంపై కంప్లైంట్ ఇవ్వడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కి ఆయన బయల్దేరారు. టీడీపీ ఆంధ్ర నాయకులు అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటిపై ఏపీ cid పోలీసులు అక్రమంగా ప్రవేశించి భయబ్రాంతులకు గురి చేయడం చాలా హేయమైన చర్య అని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలకు పాల్పడటం కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. రానున్న రోజుల్లో ఏపీ లోని అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాబోయే రోజుల్లో టీడీపీ ఏపీలో అధికారంలోకి వస్తుందని తమ కార్యకర్తలపై దాడులు పాల్పడితే సహించేది లేదని జీవన్ కుమార్ హెచ్చరించారు. ఏపీ సీఐడీ పోలీసులమంటూ చింతకాయల విజయ్ ఇంటిపై పోలీసులు దాడులు చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని, ఆడవాళ్ళను కూడా భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి చర్యలు పోలీసులకు తగదని అన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read Also: Sampath Nandi: ‘ఓదెల రైల్వే స్టేషన్’ కోసం పారితోషికం లేకుండా….
తాజావార్తలు
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar: టీమిండియాకు దొరికిన వజ్రం ఇతడు.. ఇక ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే: బీసీసీఐ
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!