బద్వేల్ లో బీజేపీ నైతికంగా విజయం సాధించింది అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ లో 40వేల ఓట్లను వైసీపీ రిగ్గింగ్ చేసింది. మేము ఏం చేశామో పాంప్లెట్ ఇచ్చి ఓటు అడిగాము. వైసీపీ వెయ్యి నోటు ఇచ్చి ఓటు అడిగింది. బద్వేల్ లో మేము ధర్మపోరాటం చేశాం, వైసీపీ అధర్మ యుద్ధం చేసింది. రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించింది. సీఎం సొంత జిల్లాలో ఓట్లు కొనుక్కునే దుస్థితి వైసీపీకి వచ్చింది. బద్వేల్ బైపోల్ వరకూ వైసీపీకి ప్రత్యేక హోదా గుర్తు రాలేదా… ఓట్లు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో చెప్పాలని శ్రీకాంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నాను అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ లోనూ హుజూరాబాద్ లాంటి ఫలితాలు వస్తాయి అన్నారు. ఇక బీజేపీ-జనసేన కలసి ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యొద్దనే మేము కేంద్రాన్ని అడిగాము అని పేర్కొన్నారు.