Visakhapatnam: అప్పికొండ బీచ్ యువతి కేసులో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Visakhapatnam: అప్పికొండ బీచ్ లో రాళ్ల మధ్య చిక్కున్న మచిలీపట్నంకి చెందిన కావ్య అనే యువతిని జాలర్లు కాపాడారు. యువతి తన ప్రియుడితో కలిసి బీచ్ కి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాదానికి గురైంది. NTV తో మాట్లాడిన యువతి తల్లి.. తన కూతుర్ని వర్మ అనే యువకుడు కొండ పై నుండి తోసేసి యువతి దగ్గర ఉన్న డబ్బులు నగలు తీసుకుని పారిపోయాడని ఆరోపించింది. కాగా యువతి మాత్రం కొండ పై నుండి జారిపడినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం మరో ట్విస్ట్ ని తెలియచేసారు గాజువాక సౌత్ ఎసిపి త్రీనాథ్. NTV తో మాట్లాడిన గాజువాక సౌత్ ఎసిపి త్రీనాథ్ ఈ ఘటన గురించిన విషయాలను వెల్లడించారు. నిన్న అప్పికొండ సముద్ర తీరంలో ఓ అమ్మాయి పడిపోయి ఉంటే స్థానికంగా ఉన్న మత్యకారులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని.. కాగా యువతి కాళ్లకు బలమైన గాయాలు తగిలి ఉండడంతో ఆమెను కెజిహెచ్ కు తరలించామని పేర్కొన్నారు.
Read also:Mouse Milk : వామ్మో..! ఎలుక పాలు 18 లక్షలా..!
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అయితే ఫణీంద్ర వర్మ రాజు అనే యువకుడితో గత నెల 29న విశాఖకు వచ్చిందని. ఇంట్లో చెప్పకుండా రావడంతో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా. యువతిపై మచిలీపట్నం ఇనుగుదురుపేట పిఎస్ లో గత నెల 29న మిస్పింగ్ కేసు నమెదు అయ్యిందని.. కాగా విశాఖపట్నం వచ్చిన ఈ జంట గోపాలపట్నం నాయుడు గార్డెన్ లాడ్జిలో ఉండి ఈ నెల 2వ తేదిన అప్పికొండ శివాలయంకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత అరకు వెళ్లి అక్కడ కొద్ది రోజులు ఉన్నారు అని తెలిపారు ఎసిపి త్రీనాథ్. కాగా ఈ నెల 8వ తేదిన మరల అప్పికొండ శివాలయంకు వచ్చి స్వామీ దర్శనం చేసుకున్న ఈ జంట.. తిరిగి వెళ్లే సమయంలో తను కాలు జారి సముద్రంలో పడిపోయినట్లు యువతి స్టెట్మెంట్ ఇచ్చిందని.. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదని చేప్పిందని ఆయన తెలిపారు. కాగా ఇనుగుదురుపేట పోలీసులు సెట్మెంట్ రికార్డు చేసుకున్నారని.. అనంతరం యువతిని కెజిహెచ్ నుండి డిశార్చ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించామని పేర్కొన్నారు. అయితే యువకుడు అచూకీ తెలియాల్పి ఉంది అని చెప్పారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!