Minister Ramprasad Reddy: వైసీపీకి మంత్రి రాంప్రసాద్రెడ్డి సవాల్.. రాజీనామాలు చేసి రండి..!
- వైసీపీ నేతలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఛాలెంజ్..
- కడప జడ్పీ చైర్మన్ దక్కించుకున్నామంటూ వైసీపీ హడావిడి..
- రాజీనామాలు చేసి ఈరోజు ఎన్నికలకు వస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.. అయితే, దీనిపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. హాట్ కామెంట్స్ చేశారు.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికలు జరగకుండా రౌడీయిజం, పోలీస్ ఇజంతో రాష్ట్రంలోని స్థానిక సంస్థలన్నీ అస్తగతం చేసుకున్నారు.. కానీ, మా ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది.. మేం ఎక్కడ కూడా ఏ మున్సిపల్ చైర్మన్, జడ్పీ చైర్మన్, ఎంపీపీని దించేందుకు మా నాయకత్వం కానీ, మేము కానీ ముందుకు రాలేదన్నారు.. ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీ చైర్మన్ దక్కించుకున్నామంటూ వైసీపీ వారు కేకులు కోసుకోవడం, దండలు వేసుకోవడం వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు.. ఉమ్మడి కడప జిల్లాలోని 50 జడ్పీటీసీలు రాజీనామాలు చేసి ఈరోజు ఎన్నికలకు వస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుందంటూ.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు..
Read Also: Deputy CM Pawan Kalyan: పిఠాపురంపై పవన్ కల్యాణ్ రివ్యూ.. కీలక సూచనలు
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
వైసీపీ వాళ్లు వాళ్ల కుర్చీల కోసం వాళ్లే కొట్లాడుకొని తెలుగుదేశంపై మేం యుద్ధం చేసి జడ్పీ చైర్మన్ ను కైవసం చేసుకున్నామంటూ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు మంత్రి రాంప్రసాద్రెడ్డి.. రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి… ఆ రోజు రాష్ట్రంలో 92 స్ట్రైక్ రైట్స్ తో అన్ని స్థానాల్లో కూటమి ప్రభుత్వం పోటీ చేస్తుంది.. గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా గెలిచారో ఆ విధంగా స్థానిక సంస్థలలో కూటమి అభ్యర్థులు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారనే నమ్మకాన్ని వెలిబుచ్చారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!