నేరగాళ్లకు ఏపీ ఫ్రెండ్లీ స్టేట్గా మారింది: పీతల సుజాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలపై అత్యాచారాలలో ఏపీ రెండవ స్థానంలో ఉందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. సొంత చెల్లికి రక్షణ ఇవ్వలేని వ్యక్తి సీఎం జగన్ అని, ఇక రాష్ట్ర మహిళలకు ఏం ఇస్తాడు అంటూ విమర్శించారు. రాష్ట్రంలో నేరగాళ్లకు ప్రెంఢ్లీ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని దుయ్యబట్టారు. ఏపీలో మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అత్యాచారం చెయ్యాలంటే భయపడే పరిస్థితి చంద్రబాబు కల్పించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1500 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు.
Read Also: ఉద్యోగులపై ఎస్మా బాణం… ఏపీ సర్కార్ ఐడియా?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు: వంగలపూడి అనిత
జగన్ పాలనలో మహిళలకు మాన ప్రాణలకు రక్షణ లేకుండా పోయిందని వంగలపూడి అనిత ఆరోపించారు. మైనర్ బాలికలను కూడా వైసీపీ నాయకులు వదలడం లేదన్నారు. 14 ఏళ్ల బాలిక పై అత్యాచారం జరిగి రెండు నెలలు గడిచిన ఇంత వరకు న్యాయం జరగలేదని విమర్శించారు. చిన్నారిపై వైసీపీ నాయకుడు కన్నా భూశంకర్ అత్యచారం చేశాడన్నారు. మైనర్ బాలికల అపహరణలో ఏపీ రెండో స్థానంలో ఉందన్నారు. హోంశాఖ మంత్రి సుచరిత నిస్సహాయ శాఖగా మంత్రిగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా వైసీపీ నాయకుల హస్తం ఉంటుందన్నారు. అత్యచార బాధితురాలిని పరామర్శించడానికి వస్తే..ఆమెను లేకుండా చేశారు. అమ్మయిని పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులుకు విజ్ఞప్తి చేస్తున్నాం.వైపీపీ నేతలు బలహీన వర్గ మహిళలను టార్గెట్ చేశారన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారా లేదా అనే అనుమానం వస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదుకాని గంజాయి, డ్రగ్స్ వచ్చాయన్నారు. జగన్పై మహిళలు చెప్పులు విసిరరే రోజు త్వరలో వస్తుందని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!