GVL Narasimha Rao: డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ధి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసుగు చెందారు.. వైసీపీ పాలన నుండి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీలకు ఉత్తుత్తి పదవులు ఇచ్చి వైసీపీ మోసం చేసిందని ఆరోపించారు.. ఎవరికి కావాలంటే వారికి కార్పోరేషన్ పదవులు ఇచ్చారు.. కాపులు, బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది విమర్శించారు. ఇక, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది.. ఆ స్కామ్ మూలాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయని సీబీఐ వద్ద సమాచారం ఉందని వెల్లడించారు.. లిక్కర్ స్కామ్లో ఉన్నవాళ్లు తప్పించుకోలేరు.. స్కామ్లో ఉన్న వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.. లిక్కర్ స్కామ్ ద్వారా పార్టీలకు లబ్ధి చేకూరితే విచారణలో తేలుతుందన్నారు జీవీఎల్.
Read Also: Double Decker Buses : గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
మరోవైపు, వైఎస్ జగన్ ప్రభుత్వం అడ్వటైజ్మెంట్ డబ్బాలు కొట్టుకోవడం ఆపి.. ఆ నిధులు ప్రాజెక్టులకు కేటాయించాలి అని సూచించారు ఎంపీ జీవీఎల్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కేంద్ర ప్రమేయం లేదని స్పష్టం చేసిన ఆయన.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరినీ రక్షించాల్సిన అవసరం బీజేపికి లేదన్నారు. ఇక, పోలవరం నిర్మా ణంలో గత ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రిపై అనేక ఆరోపణలు ఉన్నా యి. రాష్ట్రానికి చంద్రబాబు వల్లే శని పట్టింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జీవీఎల్.. చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్య మైందని.. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాననడం హాస్యాస్పదమని.. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదంటూ గతంలోనే ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్మెన్గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!