Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Andhra Pradesh Ministers Fires On Chandrababu Naidu Over Guntur Stampede

YSRCP Leaders: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..!

Published Date :January 2, 2023 , 10:08 am
By Sudhakar Ravula
YSRCP Leaders: చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి.. ప్రజల ప్రాణాలు తీస్తోంది..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Guntur Stampede: టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న మరో కార్యక్రమంలోనూ ప్రాణ నష్టం జరిగింది.. గత నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో కొందరు కార్యకర్తలు, అభిమానులు మురుగునీటి కాల్వలో పడిపోవడంతో అపశృతి చోటుచేసుకుంది. ఐదుగురు కార్యకర్తలు అక్కడికక్కడే చనిపోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 8కు చేరిన తెలిసిందే కాగా.. తాజాగా, గుంటూరులో అదే సీన్‌ రిపీట్ అయ్యింది. గుంటూరులో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుంది. అయితే, చంద్రబాబు సభ ముగిసిన తర్వాత తొక్కిసలాట జరిగిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ చేపట్టగా.. చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురైయ్యారు. అయితే, దీనిపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్‌ జగన్.. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.. మరోవైపు.. గుంటూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు హోంమంత్రి తానేటి వనిత.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోం మినిస్టర్.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతిని తెలిపారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.. ఇక, తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు

అయితే, చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల సమయంలో 30 మందిని పోట్టనపెట్టుకున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంక్రాంతి కానుకను జగన్ ప్రభుత్వం తొలగించిందని చెప్పడానికే చంద్రబాబు ఇప్పుడు సంక్రాంతి కానుకల కార్యక్రమం నిర్వహించారు.. ప్రజలను చంపి చంద్రబాబు సాధించేది ఎమిటి? అని నిలదారు. వారి కుటుంబాలకు డబ్బులు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబులో మార్పు రావాలని ఆ దేవుడిని ప్రార్థించినట్టు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వ్యాఖ్యానించారు వెల్లంపల్లి శ్రీనివాస్‌. మరోవైపు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో సభలలో ప్రజలను బలికోనడం బాధాకరం అన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్.. వైఎస్‌ జగన్‌ సుధీర్ఘ పాదయాత్ర చేసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదన్న ఆమె.. నిన్నటి ఘటనలో భాధితులుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.. ఇక, చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అరిష్టమేనని మండిపడ్డారు మంత్రి గుమ్మనూరు జయరాం.. గతంలో పుష్కరాలు.. ఇప్పుడు సభలు అప్పుడు ప్రజలు చనిపోతున్నారు.. అందుకే చంద్రబాబుని ప్రజలు ఆదరించడం లేదన్నారు మంత్రి జయరాం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Ministers
  • chandrababu
  • Chandrababu Naidu
  • Guntur Stampede

తాజావార్తలు

  • #Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions