కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో దూకుడు పెంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల నుంచే కొత్త జిల్లాల నుంచి పరిపాలన సాగాలన్న సర్కార్ ఆదేశంతో చర్యలు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ నెల 25వ తేదీలోగా కొత్త జిల్లాల్లో మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎస్ సమీర్ శర్మ ఆదేశాలు జారీ చేవారు.. వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన సీఎస్.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక, రేపో, ఎల్లుండో కొత్త జిల్లాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించబోతున్నారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Punjab: చేసేది మొబైల్ రిపేర్.. సీఎంను ఘోరంగా ఓడించాడు..
వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సమీర్ శర్మ.. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం, ఆర్డీవో, డీఎస్పీ వంటి ఆఫీసుల ఏర్పాటుకు అందుబాటులో ఉన్నభవనాలను గుర్తించాలని సూచించారు.. మరో వారం రోజుల్లో కొత్త కలెక్టరేట్లలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.. కొత్త జిల్లాలకు వెబ్ సైట్లను కూడా అందుబాటులోకి రాబోతున్నాయి.. కొత్త జిల్లాల్లో కార్యాలయాల భవనాలకు తీసుకునే భవనాలకు ఆర్ అండ్ బీ ధరల ప్రకారం అద్దె నిర్ణయించాలని తెలిపారు.. కొత్త జిల్లాల్లో ఈ-ఆఫీసు విధానాన్ని పటిష్టంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు సీఎస్ సమీర్ శర్మ.