Anantapur: అనంతపురం నగరపాలక సంస్థలో హీటెక్కిన రాజకీయాలు.. మేయర్ పీఠంపై రోజుకో మలుపు..!
- అనంతపురం నగరపాలక సంస్థలో హీటెక్కిన రాజకీయాలు..
- మేయర్ పీఠంపై రోజుకో మలుపు తిరుగుతున్న సమీకరణాలు..
- మేయర్పై అవిశ్వాసం పెడుతున్నారన్న వార్తలతో మారుతున్న ఈక్వేషన్స్..
- ఏ కార్పొరేటర్ ఏక్షణంలో ఎవరి వైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి..
- ఆపరేషన్ ఆకర్ష్లో అన్నిరకాల ఆఫర్లు వదులుతున్న అధికారపార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: అనంతపురం నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతో పీఠంపై ఉంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 48 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వారిద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వసీం సలీంని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అది అప్పట్లో చాలామందికి నచ్చలేదు. పైగా అనంత వెంకటరామిరెడ్డికి మేయర్ వసీంకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు. మొన్నటివరకు అధికారం ఉండటంతో అంతా సైలెంట్గా ఉన్నారు. ఇప్పడు వాయిస్ మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ ని దించుతారన్న టాక్ నడిచింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మొదట తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన మరో ముగ్గురు కూడా పార్టీ మారారు. టీడీపీ వైపు మొత్తం ఐదుగురు కార్పొరేటర్లు వచ్చారు. నాలుగేళ్ల పదవీకాలం ముగియడంతో మేయర్ని దించాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవిశ్వాసం పెడతారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. పైగా వైసీపీలో చీలికలు వచ్చాయని, మేయర్ని దించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నదానికి బలం చేకూరింది. అర్బన్ ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు..
Read Also: HYDRA : మరోసారి హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
Also Read
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- Thopudurthi Prakash Reddy Vs MLA MS Raju: తోపుదుర్తి–ఎంఎస్ రాజు వివాదంలో బిగ్ ట్విస్ట్.. అద్దె ఇంటి కొనుగోలుతో సంచలనం..
- Minister Satyakumar: అమరావతిపై జగన్కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
టీడీపీ వైపు ఉన్న ఐదుగురు కార్పొరేటర్లతో సహా 18 నుంచి 22 మంది అవిశ్వాసానికి ఓకే చెప్పినట్లు మేయర్ యాంటీ వర్గం ప్రచారం చేసుకుంటోంది. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే నెంబర్ 26 ఉండాలి. ప్రస్తుతం 22 మంది ఉన్నారని మేయర్ వ్యతిరేకవర్గం చెబుతోంది. ఎక్స్ అఫిషియో కలుపుకుంటే ఫిగర్ 24కు చేరుతుంది. ఇంకో ఇద్దరు కార్పొరేటర్లను లాగడం పెద్ద విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆపరేషన్ ఆకర్ష్లో అన్నిరకాల ఆఫర్లు వదులుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో మద్దతు పలికే కార్పొరేటర్లందర్నీ తీసుకుని విజయవాడకు వెళ్ళనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కండువాలు మార్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద ఉగాదిలోపే మేయర్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి ఆ పీఠంపై కొత్త వ్యక్తి కూర్చోబెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసం తెరవెనుక అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!