Anantapur: అనంతపురం నగరపాలక సంస్థలో హీటెక్కిన రాజకీయాలు.. మేయర్ పీఠంపై రోజుకో మలుపు..!
- అనంతపురం నగరపాలక సంస్థలో హీటెక్కిన రాజకీయాలు..
- మేయర్ పీఠంపై రోజుకో మలుపు తిరుగుతున్న సమీకరణాలు..
- మేయర్పై అవిశ్వాసం పెడుతున్నారన్న వార్తలతో మారుతున్న ఈక్వేషన్స్..
- ఏ కార్పొరేటర్ ఏక్షణంలో ఎవరి వైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి..
- ఆపరేషన్ ఆకర్ష్లో అన్నిరకాల ఆఫర్లు వదులుతున్న అధికారపార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: అనంతపురం నగరపాలక సంస్థలో ప్రస్తుతం వైసీపీ క్లియర్ కట్ మెజార్టీతో పీఠంపై ఉంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా.. 48 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. వారిద్దరు కూడా వైసీపీకి మద్దతు పలికారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వసీం సలీంని మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. అది అప్పట్లో చాలామందికి నచ్చలేదు. పైగా అనంత వెంకటరామిరెడ్డికి మేయర్ వసీంకి వ్యతిరేకంగా కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు. మొన్నటివరకు అధికారం ఉండటంతో అంతా సైలెంట్గా ఉన్నారు. ఇప్పడు వాయిస్ మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ ని దించుతారన్న టాక్ నడిచింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మొదట తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి చెందిన మరో ముగ్గురు కూడా పార్టీ మారారు. టీడీపీ వైపు మొత్తం ఐదుగురు కార్పొరేటర్లు వచ్చారు. నాలుగేళ్ల పదవీకాలం ముగియడంతో మేయర్ని దించాలన్న ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అవిశ్వాసం పెడతారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. పైగా వైసీపీలో చీలికలు వచ్చాయని, మేయర్ని దించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నదానికి బలం చేకూరింది. అర్బన్ ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు..
Read Also: HYDRA : మరోసారి హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
టీడీపీ వైపు ఉన్న ఐదుగురు కార్పొరేటర్లతో సహా 18 నుంచి 22 మంది అవిశ్వాసానికి ఓకే చెప్పినట్లు మేయర్ యాంటీ వర్గం ప్రచారం చేసుకుంటోంది. మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే నెంబర్ 26 ఉండాలి. ప్రస్తుతం 22 మంది ఉన్నారని మేయర్ వ్యతిరేకవర్గం చెబుతోంది. ఎక్స్ అఫిషియో కలుపుకుంటే ఫిగర్ 24కు చేరుతుంది. ఇంకో ఇద్దరు కార్పొరేటర్లను లాగడం పెద్ద విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆపరేషన్ ఆకర్ష్లో అన్నిరకాల ఆఫర్లు వదులుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో మద్దతు పలికే కార్పొరేటర్లందర్నీ తీసుకుని విజయవాడకు వెళ్ళనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కండువాలు మార్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం నోటీసు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద ఉగాదిలోపే మేయర్ పై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి ఆ పీఠంపై కొత్త వ్యక్తి కూర్చోబెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసం తెరవెనుక అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
తాజావార్తలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!