AP Crime: కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర పేరుతో టోకరా.. మధ్యలో వదలి పరార్..!
- కేదార్నాథ్.. బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన అనంతపురం యాత్రికులకు ఓ ట్రావెల్ ఏజెన్సీ టోకరా..
- దాదాపు 70 మంది యాత్రికుల నుంచి 60 వేల రూపాయల చొప్పున వసూలు..
- అనంతపురం నుంచి హరిద్వార్ వరకు యాత్రికలను తీసుకెళ్లిన ట్రావెల్ ఏజెన్సీ..
- అక్కడి నుంచి ఏజెంట్ ఉదయ్ శంకర్ పరారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్రను చార్ధామ్ యాత్రగా పేర్కొంటారు.. మరికొందరు వీటిలో ఏవైనా రెండు సందర్శిస్తే.. ఆ యాత్రను దో ధామ్ యాత్రగా పేర్కొంటారు.. ఇందులో ఎక్కువ సంఖ్యలో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు దర్శనానికి వెళ్తుంటారు భక్తులు.. ఈ యాత్ర పేరుతో పెద్ద బిజినెస్ జరుగుతోంది.. అయితే, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన అనంతపురం యాత్రికులకు ఓ ట్రావెల్ ఏజెన్సీ టోకరా పెట్టింది. దో ధామ్ పేరుతో అనంతపురం పట్టణంలోని రామ్ నగర్ లో ఉన్న ఉదయ శంకర్ ట్రావెల్స్.. కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి పెద్ద మొత్తంలో యాత్రికల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసింది..
Read Also: IND vs SA: చరిత్ర సృష్టించే దశలో రోహిత్.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రికార్డు ఎలా ఉందంటే?
Also Read
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- Keesara Toll Plaza:ఘోర ప్రమాదం.. కారుపై బోల్తా పడ్డ ఆయిల్ ట్యాంకర్.. నుజ్జునుజ్జైన BMW కారు.!
- Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?
- CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం... సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనానికి అనంతపురానికి చెందిన దాదాపు 70 మంది యాత్రికుల నుంచి 60 వేల రూపాయల చొప్పున దాదాపు కోటి రూపాయలు ఉదయ్ శంకర్ ట్రావెల్స్ వసూలు చేసింది. నగరంలోని రామ్ నగర్ లో ఉంటున్న ఉదయ శంకర అనే వ్యక్తి ఉదయ శంకర్ ట్రావెల్స్ ను నడుపుతున్నాడు. అయితే అనంతపురం నుంచి హరిద్వార్ వరకు యాత్రికలను తీసుకువెళ్లాడు. కానీ, అక్కడ యాత్రికుల నుంచి మిగిలిన సొమ్మును వసూలు చేసి.. మరి కొద్ది సేపట్లో బయలుదేరుదామని చెప్పి అక్కడి నుంచి ఉదయ్ శంకర్ పరారయ్యాడు. ఎంతసేపటికి ట్రావెల్స్ నిర్వాహకుడు ఉదయ శంకర్ రాకపోవడంతో సొంత ఖర్చులతో హరిద్వార్ నుంచి అనంతపురానికి యాత్రికులు వచ్చారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ ఆఫీస్ వద్దకు బాధితులు వెళ్లగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి 60 వేల రూపాయలు వసూలు చేసి దాదాపు కోటి రూపాయలు టోకరా వేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ్ శంకర్ ట్రావెల్స్ యజమాని ఉదయ శంకర్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!