Pawan Kalyan: రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో ఎన్ఆర్ఐ జనసేన గల్ఫ్ విభాగం సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. పార్టీకి ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం కోటి రూపాయల విరాళం అందచేసింది. కౌలు రైతు భరోసా యాత్ర నిమిత్తం మరో రూ. లక్షా 10 వేల విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా? అని ఆయన అన్నారు. కరడుగట్టిన చట్టాలున్న దేశంల్లో బతకొచ్చు.. ఇక్కడ మాత్రం బతకలేని పరిస్థితులు కల్పించారు. రాష్ట్రంలో కౌన్సిలర్ కూడా బెదిరించేస్తాడు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
Read Also: Sangareddy: కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
మన దేశంలో మనకున్న స్వేచ్ఛ కోల్పోకూడదన్నదే నా లక్ష్యం అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. రూల్స్ పాటించాలి.. అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించాలి.. అలాంటి రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్నదే నా లక్ష్యం అని పవన్ కల్యాణ్ తెలిపారు. విదేశాల్లో ఉన్నవారంతా తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితులు కల్పించాలి.. కుల దూషణలు చేసే వారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారే రాజకీయ నాయకులుగా ఉన్నారు.. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒక తరం కోసం నా ఆఖరి శ్వాస వరకు నా నేల కోసం పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని తెలిపారు.
Read Also: Bussiness Idea: తక్కువ పెట్టుబడి తో లక్షల్లో ఆదాయం .. ఓ లుక్ వేసుకోండి..
గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం మన దేశంలో ఎందుకు బతకలేము?.. ఏ మతం అయినా.. ఏ కులం అయితే ఏంటి? నా తరఫున సమాజానికి నేను ఏమివ్వగలనన్న ఆలోచనల నుంచే పార్టీ స్థాపించాను అని పవన్ కల్యాణ్ చెప్పారు. పదేళ్లుగా నిలబడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను.. 100 శాతం గుర్తింపు వస్తుంది అని జనసేనాని అన్నారు. జనసేనకు మద్దతు ఇచ్చే వారు బలంగా పోరాడగలిగే వారు అయ్యి ఉండాలి.. లేకపోతే మనల్ని బతకనివ్వరు అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Irumudi success: పాన్ ఇండియా మోజుకు ‘ఇరుముడి’ నేర్పిన పాఠం ఇదేనా ?
-
New World Map: వరల్డ్ మ్యాప్ లో భారీ మార్పు.. దేశాల అసలు పరిమాణాలు చూపించే కొత్త మ్యాప్కు UN ఆమోదం
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!