CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… సంరక్షణ కోసం వంద రోజుల యాక్షన్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అనంతపురం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో నీటి సంరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నీరు మనందరికీ సర్వస్వం.. దానిని సంరక్షించుకోవడానికే 100 రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టాం” అని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి భద్రత కోసం సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పరిగెత్తే నీటిని నిలబెట్టడం, నిల్వ ఉన్న నీటిని సరైన విధంగా ఉపయోగించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. జలాశయాలు నింపడం, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి పద్ధతులను విస్తృతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. “నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి” వంటి పథకాల ద్వారా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చామని అన్నారు.
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
అనంతపురం వంటి ఎడారిగా మారిన ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు గతంలో ఇన్పుట్ సబ్సిడీలు అందించామని గుర్తుచేశారు చంద్రబాబు.. డ్రిప్ ఇరిగేషన్ను ప్రోత్సహిస్తూ 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందించామని చెప్పారు. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్కు రూ.1,031 కోట్ల వ్యయం చేస్తూ దేశంలో ముందంజలో ఉన్నామని వెల్లడించారు. ఈ చర్యల వల్ల రాయలసీమ హార్టికల్చర్ హబ్గా మారిందని, పండ్ల తోటల పెంపులో అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. భూగర్భ జలాల స్థాయి కూడా మెరుగుపడిందని సీఎం పేర్కొన్నారు. గతంలో అనంతపురంలో 13 మీటర్ల లోతులో లభించిన నీరు ఇప్పుడు 11 మీటర్లకే అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇది ప్రభుత్వ చర్యల ఫలితమని చెప్పారు.
అలాగే శ్రీశైలం నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని తరలిస్తున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించి, అక్కడ ఆదా అయిన నీటిని రాయలసీమకు మళ్లించామని చెప్పారు. విద్యుత్ ఛార్జీల విషయానికొస్తే, గత ప్రభుత్వాలు భారీగా పెంచిన భారం ప్రజలపై వేయకుండా కూటమి ప్రభుత్వం భరిస్తోందని సీఎం తెలిపారు. రూ.4,600 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. అంతేకాకుండా తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేయడం కూటమి ప్రభుత్వ ఘనతగా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చి, రాష్ట్రాన్ని నీటి విషయంలో స్వయం సమృద్ధిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!