Anam Ramanarayana Reddy: ఆనం సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anam Ramanarayana Reddy Sensational Comments: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై విమర్శలు చేస్తారని.. కానీ వైసీపీకి చెందిన నేతలు సొంత పార్టీకి చెందిన నేతలు, వారి ఇంట్లోని మహిళల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది నెల్లూరు రాజకీయ సంస్కృతి కాదని హితవు పలికారు. ఎన్నికల్లో టికెట్కు మీకు పోటీ వస్తున్నారని భావించి, కుటుంబంలోని స్త్రీల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నించారు. ఈ ధోరణి బాధాకరమైందని, మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. నెల్లూరు ప్రజలు తెలివైనవారని, ఎవర్ని ఎక్కడ కట్టడి చేయాలో వాళ్లకు తెలుసని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియచెప్పేందుకే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనైతిక పాలన, దోపిడి జరుగుతోందన్నారు. త్వరలోనే దీనికి మూల్యం చెల్లించుకోవాలని హెచ్చరించారు.
Ileana D’Cruz : తన ప్రెగ్నెంట్ జర్నీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇలియానా..
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- Pawan Kalyan: అభిమాని కష్టంలో ఉన్నాడని తెలిసి ఇంటికే వెళ్లిన పవన్ కళ్యాణ్.. కుటుంబానికి భరోసా!
- SBI ATM Robbery: బుక్కరాయసముద్రంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ.. నగదు దోచుకుని మిషన్ను..!
టీడీపీకి చెందిన ముగ్గురు శాసనసభ్యులను వైసీపీ వైపు తిప్పుకున్నారన్న ఆనం.. ఆ ముగ్గురి చేత రాజీనామా చేయించారా? అని నిలదీశారు. అక్రమ సంపాదనకు వారిని అడ్డుపెట్టుకున్నారని ఆరోపించారు. మొదట ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని, ఆ తర్వాత తమని అడగాలని డిమాండ్ చేశారు. ఇంకా ఏడాది అధికారం ఉన్నా, వద్దని తాను బయటకు వచ్చానన్నారు. తాను గతంలో నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, వెంకటగిరిల నుంచి పోటీ చేశానని.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కొన్నిసార్లు ఓడిపోయానని గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశిస్తే.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా, అందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ఒకవేళ పది నియోజకవర్గాల గెలుపు బాధ్యతను అప్పగిస్తే.. ఆ పని కూడా చేస్తానన్నారు. 1983లో టీడీపీ తరఫున నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచానన్నారు.
Anil Kumar Yadav: ఆనంకి ఎమ్మెల్యే అనిల్ ఛాలెంజ్.. ఓడిపోతే తప్పుకుంటా
రాజకీయాల నుంచి విరమించుకునే ముందు.. నెల్లూరు నుంచి పోటీ చేయాలని తాను భావిస్తున్నానని ఆనం అన్నారు. తన రాజకీయ జీవితం మొదలైన నెల్లూరులోనే ముగింపు కూడా కావాలని అనుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆనం ఆరోపించారు. మాదక ద్రవ్యాలకు రాష్ట్రాన్ని కేంద్రంగా మార్చేశారన్నారు. ప్రభుత్వమే దీనిని ప్రోత్సాహిస్తోందని కుండబద్దలు కొట్టారు. ఒక్క అవకాశం పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
తాజావార్తలు
-
Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
-
Sanhay Raut: ఒక్కో ఎంపీని రూ. 50 కోట్లతో కొన్నారు.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు..
-
Sing Geetham :ఇంట్లో కూర్చునే 94 ఏళ్ల వయసులో డైరెక్షన్.. అద్భుత టెక్నాలజీని బయటపెట్టిన సింగీతం!
-
UP: సమాజ్వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. కమలం వైపు చూస్తోన్న ఎంపీలు!
-
Pawan Kalyan: “ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!”.. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!