Speaker Ayyanna Patrudu: ఏ పార్టీ అయినా సరే భూ సమస్యకు కారణమైతే కేసులే.. స్పీకర్ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: మరోసారి హాట్ కామెంట్లు చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం ఏర్పాటు చేసిన రైతు సమావేశంలో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఈ పాసు పుస్తకాలు శాశ్వతమైనవని, వీటి పంపిణీ రాజకీయాలకు అతీతంగా జరగాలని సూచించారు. గ్రామీణ రైతులకు భూ హక్కులపై భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
Read Also: BRS Boycott Assembly: రేపు అసెంబ్లీని బహిష్కరించిన బీఆర్ఎస్.. సీఎంపై హరీష్ రావు ఫైర్
Also Read
భూ వివాదాలు, భూ సమస్యలకు కారణమైన వారిపై పార్టీలతో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్ అధికారులకు స్పీకర్ నేరుగా ఆదేశాలు జారీ చేశారు. “ఏ పార్టీ అయినా సరే, రైతుల భూముల విషయంలో అన్యాయానికి కారణమైతే చట్టం తన పని తాను చేస్తుంది.. కేసులు తప్పవు” అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్న ఆయన.. రాజకీయాలకతీతంగా పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు.. అయితే, భూ సమస్యలకు కారణమైన వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ చింతకాలయ అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
-
Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..